మహేష్-త్రివిక్రమ్ సినిమా పక్కా.. ఇదే రుజువు!
మహేష్- త్రవిక్రమ్ కాంబినేషన్లో త్వరలో మరో సినిమా రాబోతుందని తెలుస్తుంది. అందుకు మహేష్ చేసిన ట్వీటే నిదర్శనంగా నిలిచింది.
మహేష్బాబు, త్రివిక్రమ్ కాంబినేష్.. టాలీవుడ్లో ఓ క్రేజీ కాంబో అనే చెప్పాలి. వీరి కాంబినేషన్లో వచ్చిన `అతడు` బ్లాక్ బస్టర్. ఇది థియేటర్లో కంటే టీవీలో బాగా ఆడింది. అత్యధిక సార్లు టెలికాస్ట్ అయిన చిత్రంగా, అలాగే అత్యధిక టీఆర్పీ పొందిన చిత్రంగానూ నిలిచింది.
ఆ తర్వాత ఐదేళ్ళకి `ఖలేజా` వచ్చింది. ఈ సినిమా అటు మహేష్కి, ఇటు త్రివిక్రమ్లో ఓ భిన్నమైన ప్రయత్నం. కానీ వర్కౌట్ కాలేదు. సినిమాపై విమర్శలు వచ్చాయి. బాక్సాఫీసు వద్ద డీలా పడింది. ఆ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాలేదు. ఇదిలా ఉంటే `ఖాలేజా` విడుదలై నేటి(బుధవారం)తో పదేళ్ళు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా మహేష్ ట్వీట్ చేశారు. నటుడిగా తనని రీ ఎన్వెంట్ చేసిన చిత్రమిదన్నారు. ఎప్పటికీ తనకు ఇదొక స్పెషల్ చిత్రమని, ఈ సందర్భంగా తన మంచి స్నేహితుడు, బ్రిలియంట్ డైరెక్టర్ త్రివిక్రమ్కి థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు త్వరలో వీరి కాంబినేషన్లో సినిమా ఉండబోతుందనే హింట్ కూడా ఇచ్చాడు. `మా నెక్ట్స్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. అది త్వరలోనే ఉంటుంది` అని ట్వీట్ చేశారు మహేష్. ఈ సందర్భంగా `ఖలేజా` చిత్రానికి చెందిన ఓ వీడియోని పంచుకున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్.. పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. నెక్ట్స్ అన్నీ కుదిరితే రాజమౌళి డైరెక్షన్లో ఉంటుంది. ఇక త్రివిక్రమ్ ఈ ఏడాది `అలా వైకుంఠపురములో`తో భారీ హిట్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత ఎవరితో అనేది ఇంకా ఫైనల్ కాలేదు. చిరంజీవితో ఉంటుందన్నారు. కానీ అది మహేష్తోనే ఉండే అవకాశాలున్నట్టు మహేష్ ట్వీట్ చూస్తే అర్థమవుతుంది. ఇదే వర్కౌట్ అయితే దాదాపు 11ఏళ్ళ తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చూడొచ్చు.