అరుదైన పెళ్ళి ఫోటోని పంచుకున్న నమ్రత.. పిక్చర్ పర్ఫెక్ట్
నమ్రత రెండు అరుదైన ఫోటోలను పంచుకున్నారు. ఇందులో తమ పెళ్ళి ఫోటో, వారి కుటుంబ సభ్యులతో ఉండగా, మరోకటి నమ్రత తల్లిదండ్రులది. మ్యారేజ్ అనంతరం వారిద్దరి తల్లిదండ్రులతో దిగిన ఫోటో అది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు, నటి నమ్రతా శిరోద్కర్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మహేష్ ప్రేమని మొదట కృష్ణా అంగీకరించకపోవడంతో మహేష్, నమ్రతా సైలెంట్గా మ్యారేజ్ చేసుకున్నారు. ఓ గొప్ప, సంపన్న ఫ్యామిలీకి చెందిన వారసులైనప్పటికీ మహేష్, నమ్రత చాలా సింపుల్గా వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వీరి ప్రేమని కృష్ణ అంగీకరించారు. `వంశీ` సినిమాలో ప్రేమలో పడ్డ ఈ జంట 2005లో ఒక్కటయ్యింది.
ఇదిలా ఉంటే తాజాగా నమ్రత రెండు అరుదైన ఫోటోలను పంచుకున్నారు. ఇందులో తమ పెళ్ళి ఫోటో, వారి కుటుంబ సభ్యులతో ఉండగా, మరోకటి నమ్రత తల్లిదండ్రులది. మ్యారేజ్ అనంతరం వారిద్దరి తల్లిదండ్రులతో దిగిన ఫోటో అది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ, `అప్పటికీ ఇప్పటి పర్ఫెక్ట్ పిక్చర్. అసాధారణమైన యాధృచ్చికం. స్వర్గంలో నిర్ణయించిన వివాహలు` అని పేర్కొంది. తమ పెళ్ళి ఫోటోల్లో సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరాదేవితోపాటు నమ్రత తల్లిదండ్రులున్నారు.
నమ్రత ఇచ్చిన సర్ప్రైజ్తో ఆమె అభిమానులు, మహేష్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మహేష్ ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు.