ఈయేడు మూడు సినిమాలు చేయనున్న ప్రిన్స్..అఫీషియల్
- 2017లో మూడు చిత్రాలు చేయనున్న సూపర్ స్టార్ మహేష్
- అఫీషియల్ గా కన్ఫామ్ చేసిన ప్రిన్స్
- ఫెస్టివల్ సీజన్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్
న్యూ ఇయర్ సంబరాల మత్తు ఇంకా దిగక ముందే మహేష్ బాబు ఫ్యాన్స్ కు మరో కిక్కెక్కించే వార్త అందించాడు ప్రిన్స్. కొత్త సంవత్సరం సంబరాలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబంతో కలిసి జరుపుకున్న మహేష్ బాబు అభిమానులకు తాజా కబురుతో మరింత కిక్ ఎక్కించాడు. మొత్తం మీద తమ హీరో వచ్చే ఏడాది మూడు సినిమాలు చేయనున్నట్లు ఎనౌనస్ చేయడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ యమా హేపీ అవుతున్నారు.
ఈ సీజన్ని అందరికన్నా ఎక్కువ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా తర్వాత తాను 3 పెద్ద సినిమాలు చేయనున్నట్టు ముందుగానే ప్రకటించాడు మహేష్ బాబు.
ప్రస్తుతం ఏ.ఆర్. మురుగదాస్ సినిమాతో బిజీగా వున్న మహేష్ బాబు తన తర్వాతి సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో చేయనున్నట్టు వెల్లడించాడు. కొరటాల డైరెక్షన్లో ఇదివరకే 'శ్రీమంతుడు' సినిమా చేసిన మహేష్ బాబు.. ఇప్పుడు అతడి కాంబినేషన్లో మరో సినిమా ప్రకటించడం మహేష్ ఫ్యాన్స్కి భలే ఆనందాన్నిస్తోంది. కొరటాల తర్వాత మహేష్ బాబు చేయనున్న రెండవ సినిమా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లోనిది. ఈ సినిమాను దిల్ రాజు, అశ్వినిదత్ కలిసి నిర్మించనున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... అతడు, ఖలేజా వంటి సినిమాల్ని డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్తో 3వ సినిమా చేయనున్నట్టు మహేష్ ట్వీట్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని ప్రోడ్యూస్ చేయనున్నట్టు తన ట్వీట్లో పేర్కొన్నాడు మహేష్.