టాలీవుడ్ సువర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించడం అలవాటుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ నెక్స్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. 

టాలీవుడ్ సువర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించడం అలవాటుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ నెక్స్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక ఆ తరువాత పరశురామ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న మహేష్ త్రివిక్రమ్ ని కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఒక కమర్షియల్ యాడ్ ద్వారా ఈ ఇద్దరు ఒకటయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరోల యాడ్స్ కు డైరక్షన్ చేసే త్రివిక్రమ్ చాలా రోజుల తరువాత మహేష్ ను కలిశాడు. 

ఇదివరకే ఈ కాంబినేషన్ లో అతడు - ఖలేజా వంటి సినిమాలు తెరకెక్కాయి. ఇక రీసెంట్ గా మహేష్ తో ఒక చిన్న లైన్ గురించి త్రివిక్రమ్ చర్చించినట్లు సమాచారం. త్వరలో ఈ కాంబోపై అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు టాక్.