'సరిలేరు నీకెవ్వరు': మహేష్ కు ఆ వీడియో లు చూపిస్తారట
కొన్ని వృత్తులను, ఉద్యోగాలను తెరపై చూపించాలంటే ప్రత్యేకమైన కసరత్తు దర్శకుడు, హీరో చెయ్యాల్సి ఉంటుంది. లేకపోతే ఫెరఫెక్షన్ దెబ్బతిని సక్సెస్ మాట ఎలా ఉన్నా విమర్శలు తప్పవు. ఇది గమనించిన ఈ జనరేషన్ దర్శకుడు సాధ్యమైనంత రీసెర్చ్ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు'కోసం కూడా దర్శకుడు అనీల్ రావిపూడి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడంటున్నారు.
కొన్ని వృత్తులను, ఉద్యోగాలను తెరపై చూపించాలంటే ప్రత్యేకమైన కసరత్తు దర్శకుడు, హీరో చెయ్యాల్సి ఉంటుంది. లేకపోతే ఫెరఫెక్షన్ దెబ్బతిని సక్సెస్ మాట ఎలా ఉన్నా విమర్శలు తప్పవు. ఇది గమనించిన ఈ జనరేషన్ దర్శకుడు సాధ్యమైనంత రీసెర్చ్ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు'కోసం కూడా దర్శకుడు అనీల్ రావిపూడి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడంటున్నారు.
మహర్షితో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా రీసెంట్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మహేష్ 26వ సినిమాగా డిఫరెంట్ కథని ఎంచుకున్నాడు. వరుస హిట్స్ తో సూపర్ ఫాంలో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు టైటిల్ తో ఈ సినిమాను ప్రారంభించాడు మహేష్. ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ గా కనపడనున్నారని సమాచారం.
సినిమాలో ఆ సీన్స్ కనపడేది కొద్ది సేపే అయినా ఫెరఫెక్ట్ గా ఉండాలని మహేష్ ఆదేశించారట. దాంతో అనీల్ రావిపూడి స్వయంగా ఆర్మీ అధికారులను కలిసి వారి అనుభవాలను తీసుకుని కొన్నిటిని సినిమాలో కలపటమే కాకుండా...ఆ స్దాయి వ్యక్తులు, ఎలా మాట్లాడతారు, ఎలా నడుస్తారు, ..వాళ్ల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది వంటి విషయాలకు సంభందించి కొన్ని వీడియోలు తీసారట. వాటిని మహేష్ చూసి తెరపై చూపిస్తారట. గ్రేట్ కదా
దిల్ రాజు, అనిల్ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండగా యంగ్ సెన్సేషన్ రష్మిక మందన్న మహేష్ సరసన హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమాను 2020 సంక్రాంతి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. సెంటిమెంట్ను ఫాలో అవుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి కూడా మహేష్ హాజరు కాలేదు.