ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పటికే  వారసులతో నిండిపోయి ఉంది. అందులో కొంత మందిసక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తుండగా.. మరికొందరు మాత్రం  అసలు కనిపించకుండాపోయారు.. తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో వారసుడు మెరవబోతున్నట్టు తెలుస్తోంది. 

స్టార్ హీరోల వారసులతో టాలీవుడ్ నిండిపోయి ఉంది. అందులో చూసుకుంటే మెగా వారసులే ఎక్కువ. ఇతర సినిమా ఫ్యామిలీ నుంచి కూడా వారసులు వస్తూనే ఉన్నారు. ఇక తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ ఫ్యామిలీ నుంచి.. గల్లా అశోక్ కుమార్ ఆమధ్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.మహేష్ చెల్లెలు భర్త సుధీర్ బాబు కూడా టాలీవుడ్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈక్రమంలో.. మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ జరగబోతున్నట్టు తెలుస్తోంది. 

మహేష్ ఫ్యామిలీ నుంచి ఎవరు హీరోగా ఎంట్రీ ఇచ్చినా కూడా.. సూపర్ స్టార్ సపోర్ట్ చేస్తూ వచ్చాడు. తాజాగా గల్లా అశోక్ ఎంట్రీ ఇవ్వడంతో మహేష్ కూడా మొదట్నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. మహేష్ అభిమానులు కూడా గల్లా అశోక్ కి సపోర్ట్ చేశారు. ఇప్పుడు మహేష్ బాబు మరో  అల్లుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గల్లా జయదేవ్ – పద్మావతిల రెండో కుమారుడు, గల్లా అశోక్ తమ్ముడు సిద్ధార్థ గల్లా కూడా హీరోగా వెండితెరపై మెరవబోతున్నట్టు తెలుస్తోంది. 

అయితే గల్ల సిద్దార్థ్ ఎంట్రీ ఏ దర్శకుడితో జరగబోతుంది అని అంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో కొత్త దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాడని సమాచారం. అంతే కాదు ప్రస్తుతం హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న  శ్రీలీలను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట.  ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైనట్టు తెలుస్తుంది. దీంతో త్వరలోనే మహేష్ అల్లుడు సిద్ధార్థ్ గల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.