SVP:'సర్కారువారి పాట' ఫస్ట్ వీక్ కలెక్షన్ , వీకా ? కేకా?
సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల తర్వాత సర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, పరశురాం తెరకెక్కించారు.
మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారువారి పాట నిన్న గురువారంతో ఫస్ట్ వీక్ ... 7 రోజులు చేసుకుంది. ఈ వీక్ లో మేకర్స్ ప్రకటించింది ఉన్నదున్నట్లు నిజమైతే ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సర్కారువారి పాట సినిమాకు 79 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 107 కోట్ల రూపాయలకు పైగా నెట్ వచ్చినట్టు చెప్పుకొచ్చారు.
ఇక సర్కారువారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ అంటోంది. ఆ లెక్కలు నిజమైతే.. ఈ వీకెండ్ కి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయమే. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. తెలుగు రాష్ట్రాల్లో సర్కారువారి పాట సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి…
నైజాం – 29.90 కోట్లు
సీడెడ్ – 9.95 కోట్లు
ఉత్తరాంధ్ర – 10.71 కోట్లు
ఈస్ట్ – 7.40 కోట్లు
వెస్ట్ – 4.75 కోట్లు
గుంటూరు – 7.99 కోట్లు
నెల్లూరు – 3.07 కోట్లు
కృష్ణా – 5.13 కోట్లు
సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల తర్వాత సర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, పరశురాం తెరకెక్కించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకుంది.