Asianet News TeluguAsianet News Telugu

మహేష్ 'మైనపు విగ్రహం' ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా...

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం పెట్టబోతున్న సంగతి తెలిసిందే.  అయితే ఆ విగ్రహం పెట్టబోయోది సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ లో కావటంతో ఫ్యాన్స్ దాన్ని చూడటం ఎలా ఆలోచనలో పడిపోయారు. 

mahesh babu's wax statue to be unveiled in AMB cinemas
Author
Hyderabad, First Published Feb 6, 2019, 11:03 AM IST

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం పెట్టబోతున్న సంగతి తెలిసిందే.  అయితే ఆ విగ్రహం పెట్టబోయోది సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ లో కావటంతో ఫ్యాన్స్ దాన్ని చూడటం ఎలా ఆలోచనలో పడిపోయారు. అయితే ఈ సమస్యను మహేష్ తీర్చబోతున్నారు.

సింగపూర్ లో ఆ విగ్రహం ఆవిష్కరించే లోపలే...హైదరాబాద్ తీసుకువస్తున్నారు. మహేష్ బాబుకు చెందిన ఎఎమ్ బి సినిమాస్ లో దాన్ని కొద్దిరోజులు పాటు ఉంచబోతున్నారు. అభిమానులు వచ్చి సూపర్ స్టార్ విగ్రహంతో ఫొటో దిగచ్చు. ఇక మహేష్ బాబు కు చెందిన టీమ్ ఈ ఈవెంట్ ని ఘనంగా జరపాలని భావిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు మహేష్ చేతుల మీదుగా ఈ విగ్రహం ఆయన మల్టిప్లెక్స్ లో ఆవిష్కరిస్తారు.

ఇదంతా వచ్చే నెల అంటే మార్చిలో జరిగే అవకాసం ఉంది. రీసెంట్‌గా  మ‌హేష్ విగ్ర‌హం ఎలా ఉంటుందో చిన్న న‌మూనాతో చూపించారు శిల్పి ఇవాన్ రీస్‌. ఇందులో మ‌హేష్ హెయిర్ స్టైల్ స‌రికొత్త‌గా ఉండగా, ఇది అభిమానుల‌ని ఆకట్టుకుంటుంది. త్వరలోనే పూర్తి స్థాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మ్యూజియం యూనిట్ తెలిపింది. ప్రతిష్టాత్మక మ్యూజియంలో తమ అభిమాన హీరో విగ్రహం ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్ర‌స్తుతం మ‌హేష్ త‌న 25వ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నట్టు చిత్రం టీమ్ అధికారికంగా ప్రకటించింది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

 

Follow Us:
Download App:
  • android
  • ios