మహేష్ బాబు హీరోగా నటించిన `ఖలేజా` మూవీ శుక్రవారం రీ రిలీజ్ అయ్యింది. ఫస్ట్ డే కలెక్షన్లలో ఇది సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
టాలీవుడ్లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. పెద్ద సినిమాలు లేకపోవడంతో వరుసగా క్లాసిక్ మూవీస్ ని, బ్లాక్ బస్టర్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో రీ రిలీజ్లో స్టార్ హీరోల సినిమాలు రచ్చ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబు `ఖలేజా` మూవీ సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.
రీ రిలీజ్లో మహేష్ బాబు `ఖలేజా` సంచలనం
సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మహేష్ బాబు నటించిన `ఖలేజా` చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. 4కే రిజల్యూషన్తో ఈ మూవీని శుక్రవారం ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు.
అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల పరంగానూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. రీ రిలీజ్ మూవీస్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచింది.
`గబ్బర్ సింగ్` రికార్డు ని బ్రేక్ చేసిన మహేష్ బాబు `ఖలేజా`
మహేష్ బాబు `ఖలేజా` మూవీ మొదటి రోజు ఏకంగా రూ.8.26 కోట్ల గ్రాస్ని రాబట్టడం విశేషం. దీంతో ఈ మూవీ రీరిలీజ్ సినిమాలకు సంబంధించిన అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. గతంలో రూ.6.75 కోట్లతో పవన్ కళ్యాణ్ `గబ్బర్ సింగ్` మూవీ టాప్లో ఉంది.
ఇప్పటి వరకు రీ రిలీజ్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా `గబ్బర్ సింగ్` నిలిచింది. ఆ రికార్డులను ఇప్పుడు మహేష్ బాబు `ఖలేజా` బ్రేక్ చేయడం విశేషం.
స్ట్రెయిట్ రిలీజ్లో ఫెయిల్ అయిన `ఖలేజా`
ఇదిలా ఉంటే `ఖలేజా` మూవీ 2010లో విడుదలైంది. స్ట్రెయిట్ రిలీజ్ టైమ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. విమర్శల ప్రశంసలందుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.
కానీ ఇప్పుడు స్ట్రెయిట్ రిలీజ్ కంటే రీ రిలీజ్లోనే అత్యధిక వసూళ్లని రాబట్టడం విశేషం. ఈ మూవీ శనివారం, ఆదివారం కూడా బాగానే రన్ అయ్యే అవకాశం ఉంది.
ఈ లెక్కన ఇది సుమారు పదిహేను కోట్లకు పైగా వసూళ్లని రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమాని కొన్న నిర్మాతకి కాసుల వర్షం కురిపిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం `ఖలేజా`
ఇక మహేష్ బాబు, అనుష్క శెట్టి జంటగా నటించిన `ఖలేజా` చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడు. `అతడు` సినిమా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రమిది.
ఈ మూవీని సింగనమల రమేష్ బాబు, సీ కళ్యాణ్, ఎస్ సత్యరామమూర్తి నిర్మించారు. రూ.32 కోట్లకు రూపొందిన ఈ మూవీ రూ.18కోట్లు వసూలు చేసింది. సగం నష్టాలను తెచ్చిపెట్టింది. కానీ ఇప్పుడు ఆరేడు రెట్లు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.