Asianet News TeluguAsianet News Telugu

#Gunturkaaram కు ఫర్మిషన్స్ దొరక్కపోతే, ఆ రేట్లకు అడ్డంగా బుక్కైపోతాం..

 గుంటూరు కారం చిత్రం హెవీ కాంపిటేషన్ లో రిలీజ్ అవుతోంది.  A&B సెంటర్లలలో ఈ సినిమాకు 1/3rd స్క్రీన్స్ దొరుకుతున్నాయి..

Mahesh Babu #GunturKaaram needs 6 shows of permission in AP jsp?
Author
First Published Dec 31, 2023, 2:15 PM IST

సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం  ‘గుంటూరు కారం’. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.   మహేష్ కు జోడీగా శ్రీలీలా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.  ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజిలో జరిగినట్లు సమాచారం. దాదాపు వందకోట్లు దాకా బిజినెస్ జరిగినట్లు చెప్తున్నారు. ఈ సిట్యువేషన్ లో ...ఆ రికవరీ లు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం.

ఇప్పుడు ఈ చిత్రం రైట్స్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కు ఒకటే సమస్య . అది నైజాం లో నో ప్లాబ్లం. టిక్కెట్ రేట్లు ఖచ్చితంగా బాగా పెరిగేందుకు, స్పెషల్ షోలకు ఫర్మిషన్స్ వస్తాయి. అదే ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి అంత ఈజీ కాదు. నలభై రూపాయలు మాత్రమే సలార్ కు పెంచారు. మినిమం అరవై రూపాయలు అయినా టిక్కెట్ రేటు పెంచకపోతే ఇబ్బందుల్లో పడతాము అంటున్నారు. అలాగే రిలీజ్ రోజు ఆరు షోలు ఉండాలని, అఫ్పుడే రికవరీకు మార్గం ఏర్పడుతుందని చెప్తున్నారు. సినిమాపై ఉన్న క్రేజ్ తో భారీ రేట్లకు సినిమా తీసుకున్నవాళ్లు ప్రభుత్వం పర్మషన్స్ ఎలా స్పందిస్తుందో అనే టెన్షన్ లో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఆంధ్రాలో ఆరు షోలకు ఫర్మిషన్ కష్టమే అని తెలుస్తోంది. నాలుగు గంటల షో నుంచే సినిమాలు మొదలు అవుతాయి. ఒంటిగంట షోలు ఉండవు. 

సాధారణంగా పెద్ద సినిమాకు మాగ్జిమం థియేటర్స్ దొరికితే స్పెషల్ షోలు, టిక్కెట్ హైక్ ల టెన్షన్ ఉండదు. అయితే గుంటూరు కారం చిత్రం హెవీ కాంపిటేషన్ లో రిలీజ్ అవుతోంది.  A&B సెంటర్లలలో ఈ సినిమాకు 1/3rd స్క్రీన్స్ దొరుకుతున్నాయి.. ఆ విషయం మిగతా సినిమాలకు తెలుసు.దాంతో వారి లెక్కలు వారికిు ఉంటాయి.ఈ సినిమా ఓవర్ ఫ్లోస్ తో తమ సినిమాలు హౌస్ ఫుల్ అవుతాయని. దాంతో ఎవరూ వెనక్కి తగ్గేదేలేదు అన్నట్లు కాంపిటేషన్ లో ఉన్నారు. ఇదే గుంటూరు కారం కొనుక్కున్న వాళ్లు కు పెద్ద టెన్షన్ గా మారిందని టాక్. 

    గుంటూరు కారం చిత్రంలో శ్రీలలో పాటు  హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.   హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది..  అతడు, ఖలేజా  చిత్రాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.  మహేశ్‌ - త్రివిక్రమ్‌ స్టైల్ మాస్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios