Asianet News TeluguAsianet News Telugu

డైరెక్టర్ జయకు.. సినీ ప్రముఖుల నివాళి

ఆమెకు నివాళులర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆమె నివాసానికి చేరుకున్నారు.
 

mahesh babu and venkatesh condolence the director jaya
Author
Hyderabad, First Published Aug 31, 2018, 11:52 AM IST

తెలుగు సినీ మహిళా డైరెక్టర్ జయ గురువారం రాత్రి గుండె నొప్పితో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమెకు నివాళులర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆమె నివాసానికి చేరుకున్నారు.

విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు, నమ్రతా, నటుడు ఆది, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఆయన కుమారుడు ఆకాశ్ పూరీ, సుధీర్ బాబు, మంచు మనోజ్, డైరెక్టర్ నందినీ రెడ్డి, డ్యాన్స్ మాష్టర్ శేఖర్, యాంకర్ ఝాన్సీ, నటుడు ఉత్తేజ్ తదితరలు ఆమె నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. 

mahesh babu and venkatesh condolence the director jaya

ప్రేమలో పావని కల్యాణ్ అనే సినిమాతో దర్శకురాలిగా మారిన ఆమె చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, లవ్లీ, వైశాఖం వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. 

జర్నలిస్టుగా ఆమె తన కెరీర్ ను ప్రారంభించి, సూపర్ హిట్ అనే సినీ వారపత్రికను ప్రారంభించారు. ఆమె తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాలెం గ్రామంలో జన్మించారు .

అన్నామలై విశ్వవిద్యాలయంలో ఎంఎ సైకాలజీ పూర్తి చేసిన తర్వాత ఆంధ్రజ్యోతితో జర్నలిస్టుగా కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత చిత్రజ్యోతి, ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికల్లో పనిచేశారు. 2002లో దీపక్, అంకిత జంటగా నటించిన ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రంతో చిత్ర దర్శకురాలిగా మారారు.

 

read more related news

మహిళా సినీ దర్శకురాలు జయ కన్నుమూత

Follow Us:
Download App:
  • android
  • ios