`మహాభారత్` నటుడు కన్నుమూత.. విషాదంలో బాలీవుడ్
బాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. `మహాభారత్` నటుడు గుఫీ పైంతాల్ కన్నుమూసింది. `మహాభారత్`లో శకుని మామగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు.
దేశంలో అత్యంత ఆదరణ పొందిన సీరియల్గా `మహాభారత్` నిలిచింది. ఇందులో శకుని మామగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుఫీ ఫైంతాల్(78) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని పైంతాల్ మేనల్లుడు హిటెన్ వెల్లడించారు.
గుఫీ ఫైంతాల్ అసలు పేరు సరబ్జిత్ సింగ్ పైంతాల్. నటుడు కావడానికి ముందు ఆయన ఆర్మీలో పనిచేశారు. బాలీవుడ్లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు, సీరియల్స్ లో ఆయన నటించారు. `మహాభారత్` సీరియల్ ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతోపాటు `బహదూర్ షా జఫర్`, `కానూన్`, `ఓం నమ శివాయ`, `సీఐడీ`, `కోయి హై ద్వారకాధీష్ భగవాన్ శ్రీ కృష్ణ`, `రాధాకృష్ణ` లో నటించారు. ఆయన చివరగా `జై కన్నయ్య లాల్ కీ`లో నటించారు.
వీటితోపాటు `రఫూ చక్కర్`తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత `దిల్లాగి`, `దేశ్ పరదేశ్`, `సుహాగ్` వంటి చిత్రాల్లో నటించాడు. ఇక గుఫీ పైంతాల్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. గుఫీకి కొడుకు, కోడలితోపాటు ఓ మనవడు ఉన్నారు. గుఫీ అంత్యక్రియలు అంథేరి సబర్బన్లోని శ్మశానవాటికలో ఈ సాయంత్రం నిర్వహించనున్నారు.