Asianet News TeluguAsianet News Telugu

‘లూసిఫర్’ రీమేక్ డైరక్టర్ ని ఫైనల్ చేసిన చిరు

తాజాగా ఈ చిత్రం రీమేక్ డైరక్టర్ ని చిరంజీవి ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు గ్యాప్ రావటంతో తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన చిరంజీవి ఈ విషయాన్ని ఫైనలైజ్ చేసి, ఆ డైరక్టర్ కు అడ్వాన్స్ పంపి, స్క్రిప్టు వర్క్ మొదలెట్టమని చెప్పినట్లు సమాచారం. 

Lucifer movie telugu remake director locked
Author
Hyderabad, First Published Apr 10, 2020, 11:31 AM IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం లూసిఫర్. హీరో పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా రీమేక్ హక్కులను చిరంజీవి కోసం.. రామ్ చరణ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో  ఆ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారా అని ఆసక్తికర చర్చ గత కొద్ది రోజులుగా నడుస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం రీమేక్ డైరక్టర్ ని చిరంజీవి ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు గ్యాప్ రావటంతో తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన చిరంజీవి ఈ విషయాన్ని ఫైనలైజ్ చేసి, ఆ డైరక్టర్ కు అడ్వాన్స్ పంపి, స్క్రిప్టు వర్క్ మొదలెట్టమని చెప్పినట్లు సమాచారం. 

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మించే ఈ చిత్రానికి దర్శకుడు గా నాలుగైదు ఆప్షన్స్ వెతికి,వారిలో ముగ్గురుని చిరు ముందు పెట్టారు. ఆ డైరక్టర్స్  వివి వినాయిక్ ని, బాబి ని, సుజీత్. అయితే వీళ్లలో సుజీత్ తో పనిచేయటానికి చిరంజీవి ఉత్సాహం చూపించారు. దాంతో సుజీత్ కు ఈ విషయం తెలియచేసారు. సుజీత్ కూడా ఒరిజనల్ వెర్షన్ చూసి నచ్చి, వెంటనే పని ప్రారంభిస్తానని అన్నారు. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. ఇక సుజీత్ తో సాహో తర్వాత ఏ పెద్ద హీరో చేయటానికి ధైర్యం చేయలేదు. దాంతో మరో మాట లేకుండా సుజీత్ ఈ ఆఫర్ కు ఓకే చెప్పినట్లు సమాచారం. అయినా చిరంజీవి ఫోన్ చేసి మాట్లాడితే కాదనేవారు ఎవరు.  
 
‘లూసిఫర్’ మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 12న విడుదల చేసారు. అయితే సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను అకట్టుకోలేకపోయింది. 

చిత్రం కథేమిటంటే...  రాష్ట్ర ముఖ్యమంత్రి పి.కె.అర్ (సచిన్ ఖేడేకర్) హఠాత్తు మరణం తరువాత ఆయన వారసుడు ఎవరనే చర్చ మొదలు అవుతుంది. రాష్ట్రం అంతా  కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ? అని చర్చించుకుంటున్న  నేపధ్యంలో ఈ సినిమా మొదలవుతుంది. అప్పుడు పి.కె.అర్ కి అత్యంత సన్నిహితుడు స్టీఫెన్ గట్టు పల్లి (మోహన్ లాల్)సీన్ లోకి వస్తారు.  పి.కె.అర్ కి తను ఇచ్చిన మాట ప్రకారం ఆయన  కుమార్తె ప్రియ (మంజు వారియర్)అండగా నిలబడి ఆమెను సమస్యల నుండి బయట పడేస్తాడు.

ఈ క్రమంలో ప్రియ రెండో భర్త బాబీ (వివేక్ ఒబెరాయ్) వల్ల స్టీఫెన్ కు రకరకాల సమస్యలు వస్తాయి.  అంతే కాదు కొంతమంది స్వార్ధపూరిత ఆలోచనల కారణంగా స్టీఫెన్ పై కొన్ని నిందలు పడతాయి.  ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్యన  ప్రియ (మంజు వారియర్)ను సేవ్ చేయటం ప్రధానాంశంగా కథ నడుస్తుంది. అందుకోసం స్టీఫెన్ ఎలాంటి పరిస్ధితులను ఎదురుకున్నాడు? లాంటి విషయాలు చుట్టూ సినిమా తిరుగుతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios