విసిగిపోయిన ఛార్మి... వాటికి RIP చెప్పేసింది!
సోషల్ మీడియాకు సెలవని ప్రకటించిన ఛార్మి, ఓ క్లారిటీ కోసం తిరిగి ప్రత్యక్షమయ్యారు. దర్శకుడు పూరితో పాటు తనపై వస్తున్న రూమర్స్ అన్నీ ఫేక్ అని తేల్చేశారు.
లైగర్ డిజాస్టర్ కాగా కోట్ల రూపాయల నష్టం మిగిల్చింది. ఈ క్రమంలో అనేక రూమర్స్ తెరపైకి వచ్చాయి. వాటిలో జనగణమన ప్రాజెక్ట్ ఆగిపోయిందనేది ఒక రూమర్. ఈ చిత్ర నిర్మాతలుగా ఉన్న మై హోమ్ గ్రూప్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో జనగణమన అటకెక్కిందని వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై పూరి, ఛార్మి మౌనం వహించారు. దీంతో ఈ వార్తల్లో నిజం ఉండొచ్చని టాలీవుడ్ వర్గాలు నమ్ముతున్నాయి.
అలాగే ముంబై అపార్ట్మెంట్ అద్దె కట్టలేక పూరి-ఛార్మి హైదరాబాద్ వచ్చేశారని ఓ న్యూస్ బయటికొచ్చింది. లైగర్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి పూరి-ఛార్మి ముంబైలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఆ చిత్ర షూటింగ్లో అధిక భాగం అక్కడే జరిగింది. అరేబియన్ సీ వ్యూ కలిగిన ఓ లగ్జరీ అపార్ట్మెంట్ లో పూరి, ఛార్మి ఉంటున్నారు. ఆ అపార్ట్మెంట్ అద్దె దాదాపు నెలకు రూ. 10 లక్షలు అట. లైగర్ నష్టాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పూరి... అపార్ట్మెంట్ ఖాళీ చేసినట్లు మీడియాలో కథనాలు రావడం జరిగింది.
వీటితో పాటు పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్, ఆర్థిక స్థితి, లైగర్ సెటిల్మెంట్స్ ఇలా అనేక విషయాలు గురించి పలు వార్తలు పుట్టుకొస్తున్నాయి. వీటితో విసిగిపోయిన ఛార్మి చిన్న సోషల్ మీడియా పోస్ట్స్ తో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రచారం అవుతున్న రూమర్స్ అన్నీ ఫేక్... మేము పూరి కనెక్ట్స్ బ్యానర్ డెవలప్మెంట్ పై పని చేస్తున్నామంటూ.. ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. ఛార్మి లేటెస్ట్ ట్వీట్ వైరల్ గా మారింది. కాగా రీసెంట్ గా ఛార్మి సోషల్ మీడియాకు చిన్న విరామం ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.