‘వీరసింహారెడ్డి’ అప్డేట్స్ లో మార్పులు.. ‘మాస్ మొగుడు’ కాదు, ట్రైలర్ రాబోతోంది.. లేటెస్ట్!
బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్ర ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ సందర్భంగా ఇంట్రెస్టిగ్ అప్డేట్స్ అందిస్తున్నారు. ప్లాన్ ప్రకారం.. రేపు రావాల్సిన క్రేజీ సాంగ్ కు బదులుగా మరో అప్డేట్ ఇవ్వబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.
సంక్రాంతి కానుకగా నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ (Balakrishna) నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సరిగ్గా పదిరోజుల్లో థియేటర్లలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుండగా.. మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అదిరిపోయే అప్డేట్స్ ను అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను ప్రస్తుతం జోరుగా నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు ఇదే బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’కు మంచి హైప్ ను అందించారు. ఇక బాలయ్య సినిమా ప్రమోన్స్ లోనూ స్పీడ్ పెంచనున్నారు.
ఈ సందర్భంగా షెడ్యూల్ ప్రకారం రావాల్సిన అప్డేట్స్ లో చిన్న మార్పు చేశారు. రీసెంట్ అనౌన్స్ మెంట్ ప్రకారం.. ‘వీరసింహారెడ్డి’ నుంచి రేపు సాయంత్రం ‘మాస్ మొగుడు’ (Mass Mogudu) సాంగ్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అప్డేట్ కు బదులు మరో అప్డేట్ రాబోతుందని తాజాగా ప్రకటించారు. తర్వాతి తేదీలో ‘మాస్ మొగుడు’ సాంగ్ విడుదల అవుతుందని, అంతకంటే ముందు ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. దానితో పాటు మాసీవ్ ఈవెంట్ ఎప్పుడనేది కూడా డేట్ ను అనౌన్స్ చేస్తామన్నారు. లేటెస్ట్ అప్డేట్ తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇప్పటి నుంచి ‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని గట్టిగా ప్రమోట్ చేయబోతున్నారు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 5న రాయలసీయలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రం నుంచి అప్డేట్స్ కు అభిమానులు, సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మాలినేని డైరెక్ట్ చేస్తున్నారు. బాలయ్య సరసన గ్లామర్ బ్యూటీ శ్రుతి హాసన్ (Shruti Haasan) నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. జవనరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.