లతా మంగేష్కర్‌ తన ఏడు దశాబ్దాల సినీ కెరీర్‌లో యాభైవేలకుపైగా పాటలు ఆలపించారు. దాదాపు అందరు సంగీత దర్శకులతో పనిచేశారు. ఒక్కో మ్యూజిక్‌ డైరెక్టర్‌తో వేల పాటలు పాడారు. కానీ హిందీలో పాపులారిటీని పొందిన ఓపీ నయ్యర్‌(ఓం ప్రకాష్‌ నయ్యర్‌) సంగీత సారథ్యంలో మాత్రం ఆమె ఒక్క పాట కూడా పాడలేదు.

గాన శిఖరం నెలకొరిగింది. అద్భుతమైన గాత్రంతో ఇండియన్‌ ఆడియెన్స్ ని ఒలలాడించిన లతా మంగేష్కర్‌(Lata Mangeshkar Death) కన్నుమూశారు. గత నెల రోజులుగా ఆమె కరోనాతో పోరాడుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శ్రోతల హృదయాలను బద్దలు చేస్తూ ఆమె అనంత శిఖరాలకు వెళ్లిపోయారు. మన మధ్య నుంచి అస్తమించారు. సినీ సంగీతాన్ని శోకసంద్రంలో ముంచెత్తారు. తను విశ్రాంతి తీసుకుంటున్నారు. 

`తెల్ల చీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె చీకట్లో..` ఈ పాట తెలీని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆ గానమాధుర్యానికి పరవశించిపోని శ్రోతలూ ఉండరు. అయితే, ఆ పాట పాడిన గాయని ఉత్తరాది గాయని. ఈ విషయమూ అందరికీ తెలిసిందే. కానీ, ఆమె తెలుగులో పాడింది ముత్యాల్లాంటి మూడే పాటలు. ఇది మూడోది. మొదటి రెండు పాటలూ ఈ తరానికి అసలు తెలిసే అవకాశం ఉండదు. 

1929 సెప్టెంబర్‌ 28న లతా మంగేష్కర్‌ ఇండోర్‌లో జన్మించారు. పలు భాషలలో పాటలు పాడారు. లతా మంగేష్కర్‌ 1942 నుంచి తన కెరీర్‌ను మొదలుపెట్టారు. 1000 కి పైగా హిందీ చిత్రాలలో 25 వేలకు పైగా పాటలు పాడారు. ఆమె తండ్రి దిననాథ్‌ మంగేష్కర్‌ శాస్త్రీయ గాయకులు, నాటక కళాకారులు. ఆయన అడుగజాడలలో నడచిన లతా మంగేష్కర్‌ మంచి గాయకురాలిగా పేరు ప్రఖ్యాతలు పొందారు.లతా మంగేష్కర్‌ ఇప్పటికే జాతీయ చలనచిత్ర అవార్డు, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు భారత ప్రభుత్వం నుంచి అందుకున్నారు.

ఇదిలా ఉంటే లతా మంగేష్కర్‌ తన ఏడు దశాబ్దాల సినీ కెరీర్‌లో యాభైవేలకుపైగా పాటలు ఆలపించారు. దాదాపు అందరు సంగీత దర్శకులతో పనిచేశారు. ఒక్కో మ్యూజిక్‌ డైరెక్టర్‌తో వేల పాటలు పాడారు. కానీ హిందీలో పాపులారిటీని పొందిన ఓపీ నయ్యర్‌(ఓం ప్రకాష్‌ నయ్యర్‌) సంగీత సారథ్యంలో మాత్రం ఆమె ఒక్క పాట కూడా పాడలేదు. ఇది ఇప్పటికే అంతుచిక్కని విషయంగా ఉంది. మరి ఓపీ నయ్యర్‌తో, లతా మంగేష్కర్‌కి మధ్య గొడవేంటి? ఎందుకు ఆమె పాడలేదు, ఎందుకు లతాతో తన సినిమాల్లో పాడించలేదనేది సస్పెన్స్ గా మారింది. 

అయితే ఈ విషయాన్ని లతా మంగేష్కర్‌ ఆశా భోంస్లే వెల్లడించారు. అసలు విషయం బయటపెట్టారు. లతా మంగేష్కర్, ఓపీ నయ్యర్ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఓ ఇంటర్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. లతా అంటే ఓపీ నయ్యర్‌కి ఎంతో అభిమానం అని తెలిపారు. అయితే ఆమె ఎదుగుదలని ఆయన సంతోషిస్తారని, మంచి కోరుకునే వ్యక్తి అని తెలిపింది. 

మరి ఎందుకు తన సంగీత సారథ్యంలో పాడించలేదనే దానికి ఆశా భోంస్లే స్పందిస్తూ, సింగర్‌గా లతా అంటే ఇష్టమని, కానీ ఆమె గాత్రం ఓపీ నయ్యర్‌కి నచ్చలేదని, ఆమె గొంతుని ఆయన ఇష్టపడడని, అందుకే ఆమె చేత పాడించలేదని తెలిపింది. అయితే ఈ విషయంలో లతా మంగేష్కర్‌ కూడా పెద్దగా పట్టింపులకు పోలేదని, ఆయన నిర్ణయాన్ని గౌరవించిందని, తను కూడా ఆయన సారథ్యంలో పాడలని ఎప్పుడూ ఒత్తిడి తేలేదని పేర్కొంది. ఇదిలా ఉంటే ఆశాభోంస్లేని ఓపీ నయ్యర్‌ ఎంతగానో ఎంకరేజ్‌ చేశారు. ఆమో టాప్‌ సింగర్‌గా ఎదగడంలో ఆయన సంగీత సారథ్యంలోని పాటలు కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు.