రీసెంట్ గా మరణించిన గాన కోకిల లతా మంగేష్కర్ స్మారక చిహ్నం వివాదం గట్టిగానే రాజుకుంటుంది. ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దంటూ లతా కుటుంభ సభ్యులు వేడుకున్నారు. అయితే ఇప్పటికే లతాజీని గొప్పగా గౌరవించే విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
రీసెంట్ గా మరణించిన గాన కోకిల లతా మంగేష్కర్ స్మారక చిహ్నం వివాదం గట్టిగానే రాజుకుంటుంది. ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దంటూ లతా కుటుంభ సభ్యులు వేడుకున్నారు. అయితే ఇప్పటికే లతాజీని గొప్పగా గౌరవించే విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల మృతి చెందిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పేరు మీద ముంబైలోని శివాజీ పార్క్లో స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలంటూ బీజేపి డిమాండ్ చేసిన నేపథ్యంలో... అధికార శివసేన-కాంగ్రెస్ కూటమి, ప్రతిపక్ష బీజేపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ డిమాండ్ వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడింది.
లతా మంగేష్కర్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలంటూ బీజేపి ఎమ్మెల్యే రామ్ కదమ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాయడంతో ఈ వివాదం రాజుకుంది. ఈ వివాదం రోజు రోజుకు పెరుగుతుండటంతో.. లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు ఈ వివాదంపై స్పందించారు. లతా సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ మాట్లాడుతూ.. లతా మంగేష్కర్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని తమ కుటుంబం నుంచి ఎవరు కూడా ప్రభుత్వాన్ని అడగలేదన్నారు. దయచేసి ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని, ఇంతటితో ఈ వివాదాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు.
మరో వైపు శివాజీ పార్క్లో లతా స్మారక చిహ్నం ఏర్పాటుకు అధికార పార్టీ శివసేన ఇష్టంగా లేదు.. శివసేన పార్టీ వ్యవస్థాపకుడు దివంగత బాల్ థాక్రేకు శివాజీ పార్క్ తో విడదీయరాని బంధం ఉంది. ఈ పార్క్ తో సెంటిమెంట్ ముడిపడి ఉండటంతో పార్క్ లో ఇప్పుడు స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తే .. ఎన్నో ఏళ్లుగా వస్తున్న తమ సంప్రదాయానికి బ్రేక్ పడుతుందనే ఆందోళన అధికార పార్టీలో నెలకొంది. అయితే ఇంతకంటే గొప్పగా లతా మంగేష్కర్ ను గౌరవించుకోవాలి ని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ముంబైలోని కలీనాలో దాదాపు 3 ఎకరాల స్థలంలో లతా మంగేష్కర్కు నివాళిగా అంతర్జాతీయ స్థాయి సంగీత అకాడమీని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దాదాపు 1,200 కోట్లతో ఈ అకాడమీని నిర్మించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాదు ఇదే విషయాన్ని ప్రభుత్వం లతా కుటంబ సభ్యులకు తెలియజేయగా.. ఈవిషయంలో ఆమె సోదరుడు స్పందించారు. లతా దీదీకి సంగీత అకాడమీ అత్యుత్తమ నివాళి అంటూ హ్రుదయనాథ్ మంగేష్కర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ వివాదంపై ఆ రాష్ట్రంలో పలువురు ప్రముఖులు స్పందించారు. ఎంతో మంది సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న శివాజీ పార్కులో స్మారకం కట్టడం కరెక్ట్ కాదు అని అన్నారు.
