బిగ్‌ బాస్‌ ఫేమ్‌, యాంకర్‌ లాస్య మరోసారి తల్లి అయ్యింది. ఆమె పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. మరోసారి కూడా ఆమెకి కుమారుడు జన్మించాడు.

బిగ్‌ బాస్‌ ఫేమ్‌, యాంకర్‌ లాస్య మరోసారి తల్లి అయ్యింది. ఆమె పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. మరోసారి కూడా ఆమెకి కుమారుడు జన్మించాడు. మంగళవారం తమకి కుమారుడు పుట్టినట్టు వెల్లడించింది లాస్య. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. తమ జీవితంలో కొత్త ప్రేమని కలుసుకున్నాం` అని పేర్కొంది లాస్య. మార్చి 7న తమకు కుమారుడి పుట్టినట్టు వెల్లడించింది. 

అయితే ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ చిన్న వీడియోని పంచుకుంది లాస్య. ఇందులో తన భర్త మంజునాథ్‌ చేతులు ఓపెన్‌ చేసి `ఇట్స్ ఏ` అని, లాస్య చేతులు ఓపెన్‌ చేసి `బేబీ` అని, తన కుమారుడి చేతులు ఓపెన్‌ చేసి `బాయ్‌` అని ప్రకటించారు, చివరగా చిన్నారి చేతిని చూపించారు. డిఫరెంట్‌ కలర్స్ తో ఈ విషయాన్ని వెల్లడించారు. హోలీ స్పెషల్‌గా తమ కుమారుడు జన్మించినట్టు ప్రకటించడం విశేషం. 

View post on Instagram

లాస్య, మంజునాథ్‌ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వారి వివాహాన్ని పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో సీక్రెట్‌గానే పెళ్లి చేసుకున్నారు. చాలా కాలంగా పేరెంట్స్ కి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు పేరెంట్స్ ని ఒప్పించి మళ్లీ మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరికి కుమారుడు జున్ను జన్మించాడు. గత సీజన్‌లో లాస్య `బిగ్‌ బాస్‌` షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆమె తనదైన ఆటతో అలరించారు. ఇక గతేడాది సెప్టెంబర్‌లో తన రెండో ప్రెగ్నెన్సీని ప్రకటించింది లాస్య. ఇప్పుడు పండంటి కుమారుడికి జన్మనిచ్చింది. చిన్నారి, తల్లి ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తుంది.