నడి రోడ్డు మీద ప్రెస్ మీట్.. వర్మ ట్వీట్!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది.
అయితే ఇప్పుడు ఏపీలో సినిమా విడుదలపై అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో మే 1న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సంధర్భంగా ఆదివారం రోజున విజయవాడ నోవాటెల్ లో ప్రెస్ మీట్ ను నిర్వహిస్తున్నట్లు వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ ప్రెస్ మీట్ జరగనున్నట్లు చెప్పారు.
అయితే ఆ హోటల్ వారికి ఎవరో వార్నింగ్ ఇవ్వడంతో భయంతో క్యాన్సిల్ చేశారని.. ఈ విపరీత పరిస్థితుల్లో ట్రై చేసినా అన్ని హోట్టలూ, క్లబ్బుల, మేనేజిమెంట్లు, మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి భయంతో జడిసి పారిపోయారని వర్మ పేర్కొన్నారు. దీంతో నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నా అంటూ వర్మ ట్విటర్ లో పోస్ట్ పెట్టాడు.
నేను పైపుల రోడ్డులో NTR circle https://t.co/3HMe4v1LN1 దగ్గర
— Ram Gopal Varma (@RGVzoomin) April 27, 2019
నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నా
మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం pic.twitter.com/MrshlhD61c
''మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం'' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చాడు.