ఫైనల్ గా మంచు సుబ్బ లక్ష్మి దిగింది!
ప్రస్తుతం వెబ్ సిరీస్ల మేనియా ఇండియాలో బాగా పెరిగింది. ఇప్పటికే రకరకాల డిజిటిల్ మాధ్యమాల్లో కొన్ని వెబ్ సీరిస్లో దుమారం రేపుతున్నాయి. ఈమధ్య సినిమాలకు పోటీ ఇస్తూ వెబ్ సిరీస్లు రెడీ అవుతున్నాయి. దాంతో స్టార్స్ సైతం వీటిల్లో నటించటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా వీటికి సినిమాల్లా రిలీజ్, పబ్లిసిటీ వంటి కమర్షియల్ తలనొప్పులు ఉండవు..
ప్రస్తుతం వెబ్ సిరీస్ల మేనియా ఇండియాలో బాగా పెరిగింది. ఇప్పటికే రకరకాల డిజిటిల్ మాధ్యమాల్లో కొన్ని వెబ్ సీరిస్లో దుమారం రేపుతున్నాయి. ఈమధ్య సినిమాలకు పోటీ ఇస్తూ వెబ్ సిరీస్లు రెడీ అవుతున్నాయి. దాంతో స్టార్స్ సైతం వీటిల్లో నటించటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా వీటికి సినిమాల్లా రిలీజ్, పబ్లిసిటీ వంటి కమర్షియల్ తలనొప్పులు ఉండవు.. కాన్సెప్ట్ మంచిదైతే చాలు జనాలు ఈజీగా ఏక్సెప్ట్ చేసేస్తారు.. దానికి తోడు బడ్జెట్ కూడా తక్కువే. అందుకేనేమో మంచు లక్ష్మి సైతం ఓ వెబ్ సీరిస్ తో రెడీ అవుతోంది.
మిసెస్ సుబ్బ లక్ష్మి టైటిల్ తో రూపొందే ఈ వెబ్ సీరిస్ ...జీ 5 లో మార్చి 8 నుంచి ప్రారంభం కానుంది ఉమెన్స్ డే సందర్బంగా ఈ వెబ్ సీరిస్ తెరకెక్కుతోంది. చాలా కాలం క్రితమే ఈ వెబ్ సీరిస్ పూర్తైనా, రిలీజ్ డేట్ కోసం ఆగారు.
ప్రముఖ సినీ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి రాసిన ఈ వెబ్ సీరిస్ పూర్తిగా ఓ జంట చుట్టూ తిరుగుతుంది. భర్త ..వెడ్డింగ్ యానవర్శిరీ డేట్ మర్చిపోవటంతో ...కోపగించిన భార్య ఓ రోజంతా తన ఐడిండెటితో తనలాగే బ్రతకాలనుకుంటుంది. ఆ క్రమంలో పరిణామాలను ఫన్నీగా వివరిస్తుంది. ఈ సీరిస్ లో మంచు లక్ష్మికు భర్తగా అవసరాల శ్రీనివాస్ కనిపిస్తారు.