టైటిల్ నుంచి టీజర్, పాటలు, ట్రైలర్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన సినిమా ‘ఖుషి’. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్.. వాళ్ల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి అదిరిపోయే బజ్ ఉంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్లు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే హీరో,హీరోయిన్స్ ఇద్దరూ ప్రమోషన్స్ చేస్తూ అదరకొడుతున్నారు. దాంతో లైగర్ ని మర్చిపోవచ్చు అని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అలాగే శాకుంతలం పై ఇక మాట్లాడాల్సిన అవసరం ఉండదని సమంత ప్యాన్స్ ధైర్యంగా ఉన్నారు.
ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెన్సారును పూర్తిచేసుకుంది. యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘165 నిమిషాల నిడివితో గల ‘ఖుషి’ సినిమా మూవీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీగా వుంది. అయితే ఈ రన్ టైమ్ బయిటకు వచ్చాకే అభిమానులు కంగారుపడుతున్నారు. రెండు గంటల నలభై ఐదు నిముషాలు పాటు ఎంగేజ్ చేయటం అంటే మాటలు కాదు . ఏ మాత్రం తేడా కొట్టినా మొత్తం రన్ టైమే సమస్యగా మారిపోతుంది.చాలా సినిమాలకు రన్ టైమ్ ఎక్కువ అని ఫీలవుతున్నారు. కాబట్టి ఈ విషయంలోనే కాస్తంత భయపడుతున్నారనేది నిజం.
ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్తో అందరిలోనూ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. తప్పకుండా అందరి అంచనాలకు తగిన విధంగా చిత్రం బ్లాక్బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం వుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు.
