‘సాహో’కి కేటీఆర్ షాకింగ్ రివ్యూ
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'సాహో'పై ప్రశంసలు గుప్పించారు. ఈ సినిమా ఓ సాంకేతిక అద్భుతమని కొనియాడారు. ఎవరు సినిమాపై కూడా ఆయన ప్రశంసలు గుప్పించారు.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘సాహో’కు సూపర్ గా ఉందన్నారు. ఈ సినిమా టెక్నికల్గా అద్భుతంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. తాజాగా ఆయన ఒకే రోజు రెండు సినిమాలు చూసారు. ఆ చిత్రాలు.. సాహో, ఎవరు.ఈ విషయాన్ని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ సినిమాలపై రివ్యూలాంటి తన అభిప్రాయాన్ని కూడా చెప్పారు కేటీఆర్.
ఈ రెండూ అద్భుతమైన చిత్రాలే అని.. సాహో టెక్నికల్గా బ్రిలియంట్ అని.. ఇండియన్ సినిమా స్థాయిని పెంచేలా ఇది తెరకెక్కిందని అన్న కేటీఆర్.. ఈ చిత్ర హీరో ప్రభాస్, దర్శకుడు సుజీత్లకు అభినందనలు తెలిపాడు. ఇక ఎవరు సినిమా గురించి కేటీఆర్ స్పందిస్తూ.. దీని స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉందని.. అడివి శేష్, రెజీనా కసాండ్రా, నవీన్ చంద్ర అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చారని అన్నారు కేటీఆర్. ఎవరు సినిమా ఎలాగో మంచి హిట్టే, అయితే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సాహో గురించి కేటీఆర్ ఇంత పాజిటివ్గా ట్వీట్ చేయడం కాస్త ఆశ్చర్యమే అంటోంది మీడియా.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లపై విడుదలైన తెలుగు సినిమా ‘సాహో’. మొదటి రోజున బాక్సాఫీసు వద్ద రూ.100 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు. ‘సాహో’ మిక్డ్స్ టాక్ అందుకున్నా కలెక్షన్స్ వైజ్ స్టడీగానే ఉంది. ‘బాహుబలి’ హిట్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా ఇదే కావటంతో క్రేజ్ ఏ మాత్రం తగ్గటం లేదు. సుజీత్ దర్శకుడు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.