చీఫ్ గెస్ట్గా కేటీఆర్...రామ్ చరణ్ స్పెషల్ ఇన్విటేషన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 12వ చిత్రంగా బోయపాటి శీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. వినయ విధేయ రామ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ మాస్ లుక్లో కనిపించి దుమ్ము రేపనున్నాడు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 12వ చిత్రంగా బోయపాటి శీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. వినయ విధేయ రామ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ మాస్ లుక్లో కనిపించి దుమ్ము రేపనున్నాడు. రీసెంట్ గా చిత్ర టీజర్ విడుదల కాగా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య డీవీవీ నిర్మిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం ఈ నెల 27న యూసఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. రామ్ చరణ్ స్వయంగా కేటీఆర్ ని కలిసి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్రం టీమ్ ఓ పోస్టర్ ని సైతం రిలీజ్ చేసింది. అలాగే చిరంజీవి సైతం ఈ పంక్షన్ కు హాజరవుతున్నారని సమాచారం. గతంలోను చరణ్ మూవీ ధృవ వేడుకకి కేటీఆర్ హాజరై చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అందించిన సంగతి తెలిసిందే.
సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో వివేక్ ఒబేరాయ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. స్నేహ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు . చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్ (జీన్స్ ఫేం), నవీన్ చంద్ర లు నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇషా గుప్తా స్పెషల్ సాంగ్తో అలరించనుంది. యాక్షన్కు ప్రాధాన్యం ఇస్తూ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనట్టు తెలుస్తుంది.