Asianet News TeluguAsianet News Telugu

అనారోగ్యం,ఆపరేషన్,అపోలో లో చేరిక... వార్తలపై కృష్ణంరాజు వివరణ

నిన్న సాయంత్రం ఆయన తన ఇంటిలో అనుకోకుండా జారీ పడిపోవడంతో కాలుకు ఫ్యాక్చర్ అయినట్టు కృష్ణంరాజు ప్రచారం జరిగింది.  

krishnam Raju family members on his health
Author
Hyderabad, First Published Sep 15, 2021, 9:31 AM IST

కేంద్ర మాజీ మంత్రి .. రెబల్ స్టార్ కృష్ణంరాజు హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చేరారంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం ఆయన తన ఇంటిలో అనుకోకుండా జారీ పడిపోవడంతో కాలుకు ఫ్యాక్చర్ అయినట్టు కృష్ణంరాజు ప్రచారం జరిగింది. దీంతో ఆయన్ని వెంటనే అపోలో హాస్పిటల్‌లో జాయిన్ చేసారని, డాక్టర్లు ఆయన తుంటికి ఆపరేషన్ నిర్వహించినట్టు చెబుతున్నారు. 

ఆయితే కృష్ణంరాజు రొటిన్ చెకప్ కోసమే అపోలో హాస్పిటల్‌కు వెళ్లారని ఆయన కార్యాలయ వర్గం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు హీరో  సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితితో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికే ఆయన అపోలో హాస్పిటల్‌కు వెళ్లినట్టు చెబుతున్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కృష్ణంరాజు ఆరోగ్యం బాగుందని అందులో స్ప‌ష్టం చేశారు.

యూకే ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్న నేప‌థ్యంలో కృష్ణంరాజు సాధార‌ణ‌ ప‌రీక్ష‌లు చేయించుకున్నార‌ని, వైద్య ప‌రీక్ష‌ల కోస‌మే ఆసుప‌త్రికి వెళ్లామ‌ని చెప్పారు. అలాగే, యాక్సిడెంట్‌లో గాయాల‌పాలై చికిత్స తీసుకుంటోన్న‌ సాయితేజ్ ఆరోగ్య ప‌రిస్థితిని కూడా కృష్ణంరాజు తెలుసుకున్నారని, ఆయ‌న‌ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కృష్ణంరాజు ఆకాంక్షించారని చెప్పారు.

కాగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబరు 10న నిర్వహించబోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబ‌రులో 'మా' క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌ కృష్ణంరాజు భారత్‌లో ఉండడం లేదని, దీంతో ఎన్నికల బాధ్యతలు నిర్వహించడానికి పి.శివకృష్ణను నియమించారని ఇప్ప‌టికే న‌రేశ్ ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే కృష్ణంరాజు యూకే వెళ్ల‌నున్నారు.

ప్రస్తుతం కృష్ణం రాజు...తన సోదరుడు కుమారుడు ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘రాధే శ్యామ్’లో ఓ ముఖ్యపాత్రను చేస్తున్నట్టు సమాచారం. దాంతో పాటు ‘ఆదిపురుష్’ సినిమాలో కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు సమాచారం. చివరగా తెరపై...అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’లో గణపతి దేవుడిగా కనిపించి అలరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios