‘రంగమార్తాండ’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన కృష్ణవంశీ
మరాఠీ సూపర్ హిట్ మూవీ ‘నటసామ్రాట్’కు రీమేక్గా తెరకెక్కుతున్న చిత్తరం ‘రంగమార్తాండ’. ఒరిజినల్ వెర్షన్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ పోషించిన పాత్రను రీమేక్ లో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా మీద దర్శకుడు కృష్ణవంశీ కెరీర్ ఆధారపడి ఉందనేది నిజం.
సీనియర్ డైరక్టర్ కృష్ణవంశీ గత కొంతకాలంగా ఫ్యాన్స్ కోసమే అన్నట్టుగా ఓ సాలిడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ను రెడీ చేస్తున్నారు. మరాఠ సూపర్ హిట్ నటసామ్రాట్ను తెలుగు ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే అనౌన్స్ అయిన ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ ఒక్కటి తప్ప మరో అప్డేట్ రాలేదు. కరోనా టైమ్లో అయితే రంగమార్తండ గురించి ఎలాంటి వార్త రాకపోవటంతో ఈ సినిమా ఆగిపోయిందేమో అన్న డౌట్స్ మొదలయ్యాయి.ఫైనాన్సియల్ ప్లాబ్లంలు అని కొందరు అన్నారు. అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో ఓ అభిమాని ప్రశ్నిస్తే... ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు డైరెక్టర్ కృష్ణవంశీ. ప్రకాష్ రాజ్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తామన్నారు. దీన్నిబట్టి త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయన్నమాట.
ఇక కరోనా బ్రేక్ లు వచ్చాక షూటింగ్ షురూ చేసేందుకు ఏర్పాట్లు కూడా మొదలెట్టేశారు కృష్ణవంశీ. అయితే అక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఫుల్ బిజీగా సినిమాలు చేస్తున్నారు… ఇప్పుడు వాళ్ల కాంబినేషన్లో డేట్స్ అడ్జస్ట్ చేయటమే మెయిన్ టాస్క్ అయ్యి కూర్చుంది. దీనికి తోడు బుల్లితెర బిజీ ఆర్టిస్ట్ అనసూయ కూడా ఈ సినిమాలో కీ రోల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఆమె డేట్స్ కూడా అడ్జస్ట్ చేసి షూటింగ్ను మొదలు పెడతారట. ఏది ఏమైనా ఈ సినిమాపై చాలా బజ్ ఉంది.
మరాఠీ సూపర్ హిట్ మూవీ ‘నటసామ్రాట్’కు రీమేక్గా తెరకెక్కుతున్న చిత్తరం ‘రంగమార్తాండ’. ఒరిజినల్ వెర్షన్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ పోషించిన పాత్రను రీమేక్ లో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా మీద దర్శకుడు కృష్ణవంశీ కెరీర్ ఆధారపడి ఉందనేది నిజం. గత కొన్నేళ్ళుగా కృష్ణవంశీకి హిట్స్ లేవన్న సంగతి తెలిసిందే. మురారి. ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, చందమామ లాంటి బ్లాక్ బస్టర్ దక్కించుకోవడం కోసం చాలా ట్రై చేస్తున్నాడు.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ జంటగా నటిస్తున్నారు. బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాని, కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీటవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకులు .. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు. చాలాకాలం తర్వాత కృష్ణవంశీ ఇళయరాజా తో పనిచేస్తుండటం విశేషం.