Asianet News TeluguAsianet News Telugu

వైష్ణవ్ తేజ్ ప్రాజెక్ట్ కోసం ఆ నవల రైట్స్ తీసుకున్న క్రిష్

అందుతున్న సమాచారం మేరకు.. దర్శకుడు క్రిష్...ప్రముఖ నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. పది లక్షల రూపాయలకు ఈ రైట్స్ తీసుకున్నట్లు చెప్తున్నారు. 2019లో ప్రచురితం అయిన ఈ నవలకు మంచి పేరు వచ్చింది. 2019లో వచ్చిన ఆయన నవల ‘కొండపాలం’  తానా  బహుమతి గెలుచుకుంది.

Krish Bought Kondapolam Novel For His Next Project
Author
Hyderabad, First Published Aug 19, 2020, 8:37 AM IST

ఒకప్పుడు నవల రైట్స్ తీసుకుని సినిమాలు చేస్తూండేవారు. దాంతో ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలు తెరకెక్కుతూండేవి. అదే సమయంలో సాహిత్యానికి ప్రోత్సాహం లభించినట్లు ఉండేది. అయితే నవల చదివి, దాని రైట్స్ తీసుకుని, నవలకు తగ్గ స్క్రీన్ ప్లే చేయటం ఓ పెద్ద పనిలా ఈ తరం మేకర్స్ భావించటం మొదలెట్టారు. దాంతో మెల్లిమెల్లిగా సినిమాకు,సాహిత్యం దూరమైపోయింది. కానీ అడపా, దడపా క్రిష్ వంటి సాహిత్సాభిలాషులు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ నవల రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. 

అందుతున్న సమాచారం మేరకు.. దర్శకుడు క్రిష్...ప్రముఖ నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. పది లక్షల రూపాయలకు ఈ రైట్స్ తీసుకున్నట్లు చెప్తున్నారు. 2019లో ప్రచురితం అయిన ఈ నవలకు మంచి పేరు వచ్చింది. 2019లో వచ్చిన ఆయన నవల ‘కొండపాలం’  తానా  బహుమతి గెలుచుకుంది. త్వరలోనే ఈ నవలకు స్క్రీన్ ప్లే వెర్షన్ తో స్క్రిప్టు రాసి తెరకెక్కించాలని క్రిష్ భావిస్తున్నారు.  వైష్ణవ్ తేజ, రకుల్ ప్రీతి సింగ్ నటించేది ఈ సనిమాలోనే అని తెలుస్తోంది. సహజమైన పాత్రలతో ఈ సినిమా సాగుతుందని చెప్తున్నారు. 

 ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రంలో అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాల‌ని కృత‌నిశ్చ‌యంతో ఉన్నాడ‌ట క్రిష్‌. 40 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయ‌నున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్ మెంట్ బ్యాన‌ర్ పై సాయిబాబు జాగ‌ర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios