Asianet News TeluguAsianet News Telugu

ఆ ఘోర ప్రమాదం నేపథ్యంలో బన్నీ నెక్ట్స్‌!

సుకుమార్ తో చేస్తున్న పుష్ప సినిమా తర్వాత బన్ని కొరటాల శివతో చేయనున్నా సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఇంట్లోనే  ఉంటున్న శివ.. బన్ని సినిమాకు సంబందించి స్క్రిప్ట్ పనులను ఫినిష్ చేస్తున్నారట.  కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అవ్వగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన రానే వచ్చింది.
 

Koratala is inspired by the recent Gas Leak incident?
Author
Hyderabad, First Published Aug 2, 2020, 11:07 AM IST

సుకుమార్ తో చేస్తున్న పుష్ప సినిమా తర్వాత బన్ని కొరటాల శివతో చేయనున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఇంట్లోనే  ఉంటున్న శివ.. బన్ని సినిమాకు సంబందించి స్క్రిప్ట్ పనులను ఫినిష్ చేస్తున్నారట.  కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అవ్వగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన రానే వచ్చింది.

అల్లు అర్జున్ తన 21వ చిత్రం కొరటాల శివతో చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ నేపధ్యంలో విడుదలైన పోస్టర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. సముద్ర తీరాన ఇద్దరు వ్యక్తులు నిలబడి, తీరాన దూరంగా ఉన్న ఓ నగరాన్ని చూస్తున్నారు. ఇక కొరటాల శివ సినిమాలంటే మెసేజ్ ఒరియెంటేడ్‌గా ఉండనుంది. ఈ సినిమా కూడా ఆ కోవలోకే రానుంది. దాంతో ఈ సినిమా కథ ఏమై ఉండవచ్చు అనేది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కథ విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజ్ ప్రేరణగా తీసుకున్నారని అంటున్నారు. అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఓ రీసెర్చ్ స్టూడెంట్ గా కనపడబోతున్నారు. అతను ఓ కార్పోరేట్ స్కామ్ ని ఎక్సపోజ్ చేస్తాడని, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఈ కథనం సాగుతుందని చెప్తున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 
 
ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాలాగే.. ఈ మూవీ కూడా పాన్ ఇండియా చిత్రంగా రూపొందనుంది. నాలుగు భాషలలో భారీగా ఈ మూవీ విడుదల కానుందట. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, జి ఏ 2 పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జనవరిలో షూటింగ్ మొదలుకానుంది. 2022 ప్రారంభంలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios