Gunasekhar:గుణశేఖర్ని ఇబ్బంది పెట్టారు.. కొండా మురళి వార్నింగ్
రుద్రమదేవి సినిమాలో గ్రాఫిక్స్ వర్క్కు చాలా ఉంది. దాంతో ఆయన ముంబై వెళ్లి అక్కడొక గ్రాఫిక్స్ కంపెనీతో ఎగ్రిమెంట్ చేసుకుని వచ్చారు. సినిమా కంటెంట్ను వారికి ఇచ్చి వచ్చారు. అయితే ఆ వర్క్ ఎంత కాలమైనా కదలటం లేదు. ఓ ప్రక్క రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతోంది.
సోగసు చూడతరమా, రామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు.. బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన గుణశేఖర్ చరిత్రను కూడా తెరకెక్కించగలను అని నిరూపించారు. ఆ చారిత్రక కథాంశమే ‘రుద్రమదేవి’. 2015 అక్టోబర్ 9న విడుదలైన ఈ చిత్రానికి సంభందించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇన్నాళ్లకు బయిటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...
కొండా మురళి, కొండా సురేఖ దంపతులపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొండా అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా రిలీజ్ అయ్యింది కానీ వర్కవుట్ కాలేదు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. అప్పుడు గుణ శేఖర్ డైరెక్ట్ చేసిన రుద్రమదేవి సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశారు.
రుద్రమదేవి సినిమాలో గ్రాఫిక్స్ వర్క్కు చాలా ఉంది. దాంతో ఆయన ముంబై వెళ్లి అక్కడొక గ్రాఫిక్స్ కంపెనీతో ఎగ్రిమెంట్ చేసుకుని వచ్చారు. సినిమా కంటెంట్ను వారికి ఇచ్చి వచ్చారు. అయితే ఆ వర్క్ ఎంత కాలమైనా కదలటం లేదు. ఓ ప్రక్క రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతోంది. ఏం చేయాలో గుణశేఖర్ కు పాలుపోవటం లేదు. ఎన్ని సార్లు మాట్లాడినా, ఫోన్స్ చేసినా, వపెళ్లి కలిసినా వారు వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వలేదు. అడుగుతుంటే రియాక్ట్ కావటం లేదు. అప్పుడు సీన్ లోకి కొండా మురళి వచ్చారు.
కొండా సురేఖ మాట్లాడుతూ ‘‘రుద్రమదేవి సినిమా గ్రాఫిక్స్ కోసం గుణ శేఖర్గారు ఓ ముంబై కంపెనీకి కంటెంట్ ఇచ్చారు. వాళ్లేమో వర్క్ పూర్తి చేసి ఇవ్వటం లేదు. అడుగుతుంటే రియాక్ట్ కావటం లేదు. ఆ సమయంలో ఆయన మమ్మల్ని కలవాలంటూ అడిగారు. మేం కూడా రమ్మంటే కుటుంబంతో కలిసి వచ్చారు. రుద్రమదేవి సినిమా మేకింగ్లో చాలా డబ్బులను ఇన్వెస్ట్ చేశామని, గ్రాపిక్స్ విషయంలో ఇబ్బంది కలుగుతుందని అన్నారు. అప్పుడు కొండా మురళిగారు ఓ వారం రోజులు సమయం ఇవ్వమని గుణ శేఖర్గారిని అడిగారు. ఆ సమయంలో ముంబై వెళ్లి ఆ గ్రాఫిక్స్ కంపెనీ వాళ్లకి వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ తర్వాత వాళ్లు వారంలో కంటెంట్ను గుణ శేఖర్ కి ఇచ్చేశారు. అప్పటి నుంచి మాతో గుణ శేఖర్ కుటుంబానికి మంచి అనుబంధం ఏర్పడింది’’ అని తెలిపారు కొండా సురేఖ.