కోన వెంకట్ కొత్త సినిమా 'రౌడీ బేబీ'
లేటెస్ట్ మూవీ 'రౌడీబేబీ'.. ఈ సినిమా షూటింగ్ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. కోన వెంకట్ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జాతీయ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్..పెన్ ప్రక్కన పెట్టి ప్రొడక్షన్కే పరిమితం అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన బ్రాండ్ కు ఉన్న ఇమేజ్ తో సినిమాలు పట్టాలు ఎక్కిస్తున్నారు. అలాగే ప్రస్తుత వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతగా పెట్టి, తనే ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ చూసుకుంటూ కొన్నేళ్లుగా సినిమాలు ప్రొడక్షన్ చేస్తున్నారు ఆయన. తాజాగా ఆయన కోన ఫిలిం కార్పొరేషన్లో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు.
వివరాల్లోకి వెళితే..కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు, పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను దక్కించుకున్న సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ 'రౌడీబేబీ'.. ఈ సినిమా షూటింగ్ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. కోన వెంకట్ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జాతీయ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహ కీలక పాత్రలో నటిస్తున్నారు.
చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ "నేను కామెడీ చిత్రాలతో ఓ స్టార్ రైటర్గా ఎలా ఎదిగానో, అదే కామెడీని బేస్ చేసుకుని ప్రేక్షకులను మరోసారి నవ్వించడానికి రెడీ అయ్యాం. అద్భుతమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది" అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ "పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మా 'రౌడీబేబీ' చిత్రం, రెగ్యులర్ షూటింగ్ను కూడా ఈరోజు నుండే ప్రారంభిస్తున్నాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సినిమాను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేశాం. ఫిబ్రవరి నెలనాటికంతా షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అన్నారు.
సందీప్కిషన్, నేహాశెట్టి, బాబీ సింహ, హర్ష, వెన్నెలకిశోర్, పోసాని కృష్ణమురళి, షకలక శంకర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు టెక్నీషియన్స్... దర్శకత్వం: జి.నాగేశ్వర్ రెడ్డి, కథ: బాను, డైలాగ్స్: నందు, ఆర్ట్: చిన్నా, కెమెరా: సుజాత సిద్ధార్థ్, సంగీతం: చౌరస్తా రామ్, స్టంట్స్: రియల్ సతీశ్, ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్, కాస్ట్యూమ్స్: నీరజ్కోన, సహ నిర్మాత: జీవీ, సమర్పణ: కోన వెంకట్, నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ, పి.ఆర్.ఓ: వంశీ కాక.