‘కొబ్బరిమట్ట’ థియేట్రికల్ ట్రైలర్.. కత్తి మహేష్ పై డైరక్ట్ సైటైర్!
బర్నింగ్స్టార్ సంపూర్ణేశ్బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ‘పెదరాయుడు’, ‘పాపారాయుడు’, ‘ఆండ్రాయిడు’గా సంపూను మూడు గెటప్లలో పరిచయం చేస్తున్న సన్నివేశాలతో ట్రైలర్ మొదలైంది.
సోషల్ మీడియా, బిగ్ బాస్, పవన్ కళ్యాణ్ పుణ్యమా అని కత్తి మహేష్...తెలుగు రెండు రాష్ట్రాల్లనూ పాపులర్ ఫిగర్ అయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ మధ్యన హైదరాబాద్ పోలీసులు విధించిన నగర బహిష్కరణ వేటు వేసారు. అయితే ఆ బహిష్కరణ టైమ్ అయ్యిపోయింది. అందరూ మర్చిపోయారు కానీ ...‘కొబ్బరిమట్ట’ సినిమా మాత్రం ఆ విషయాన్ని గుర్తు చేస్తోంది. డైరక్ట్ గా కత్తి మహేష్ ఫొటో చూపెడుతూ సెటైర్ వేసారు.
ఓ సీన్ లో షకీలా మాట్లాడుతూ.., "ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేసారు ." అంటూ బాధపడుతుంది. ఈ డైలాగు వైరల్ అవుతుందని భావిస్తున్నారు.
బర్నింగ్స్టార్ సంపూర్ణేశ్బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ‘పెదరాయుడు’, ‘పాపారాయుడు’, ‘ఆండ్రాయిడు’గా సంపూను మూడు గెటప్లలో పరిచయం చేస్తున్న సన్నివేశాలతో ట్రైలర్ మొదలైంది. సంపూ రౌడీలను చితకబాదుతూ.. ‘పిక్చర్ అభీ బాకీ హై మేరే పితాజీ’ అని చెప్పడం ఫన్నీగా ఉంది.
ఈ సినిమాకు రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం వహించారు. ‘హృదయ కాలేయం’ ఫేం స్టీవెన్ శంకర్ కథ, కథనం అందించారు. సాయి రాజేష్ నిర్మాత. అనేక సార్లు వాయిదాపడ్డ ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 10న విడుదల కాబోతోంది.