Asianet News TeluguAsianet News Telugu

'అర్జున్ రెడ్డి' రీమేక్ లో మహేష్ హీరోయిన్!

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకి విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. విజయ్ తో పాటు హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకి కూడా మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ఈ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంలో విక్రమ్ కొడుకు దృవ్ 'అర్జున్ రెడ్డి' రీమేక్ లో నటిస్తున్నాడు. 

kiara advani in bollywood arjun reddy remake
Author
Hyderabad, First Published Sep 23, 2018, 8:26 PM IST

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకి విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. విజయ్ తో పాటు హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకి కూడా మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ఈ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

తమిళంలో విక్రమ్ కొడుకు దృవ్ 'అర్జున్ రెడ్డి' రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే హిందీలో హీరో షాహిద్ కపూర్ 'అర్జున్ రెడ్డి' రీమేక్ లో నటిస్తున్నాడు. తెలుగు వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగ హిందీ రీమేక్ ని డైరెక్ట్ చేయబోతున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట తారా సుతారియాని తీసుకున్నారు. కానీ ఆమె మరో సినిమాతో బిజీగా ఉండడంతో ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో హీరోయిన్ కోసం తర్జన భర్జనలు చేసిన చిత్రబృందం ఎట్టకేలకు కియారా అద్వానీని ఫైనల్ చేశారని తెలుస్తోంది.

మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాలో హీరోయిన్ గా నటించిన కియారా ఇటీవల లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. బాలీవుడ్ లో ఆమెకు క్రేజ్ పెరుగుతుండడంతో షాహిద్ కపూర్ ఆమెను రికమండ్ చేసినట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios