Actress Khushbu Sundar : కరోనా బారిన పడ్డ సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఫన్నీ ట్వీట్ చేశారు. కరోనాతో స్వీయ నిర్బంధంలో ఉన్న తనకు  ఒంటరిగా ుం ఉండటం కష్టం ఉందంది. తనకు ధైర్యం చెప్పాలంది. 

 

కరోనా మహమ్మారీ దెబ్బకు కొందరు సినీ యాక్టర్స్, సినీ ప్రముఖులు  ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్కు చెందిన టాప్ హీరోహీరోయిన్లు, సీనియర్ యాక్టర్స్ వరుసగా కరోనా బారిన పడుతున్నారు. అదేవిధంగా సినీయర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ కూడా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఖుష్బూ ఈ ట్వీట్ లో కరోనా లక్షణాలను తెలుపుతూనే తనకు మద్దతుగా ఉండాలని, తనను తాను స్వీయ నిర్భందం చేసుకున్న సందర్భంగా తనను ఐదు రోజుల పాటు ఎంటర్టైన్ చేయాలని ట్విట్టర్ వేదికన తెలిపింది. కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ ను తప్పించుకున్నా థర్డ్ వేవ్ లో మాత్రం కరోనా బారిన పడ్డానని  పేర్కొన్నారు.  సాధారణంగా ఎవరికి కరోనా లక్షణాలు ఉన్నా.. ఎవరు  కరోనా బారిన పడ్డా  క్వారంటైన్ తప్పదు.  

గడిచిన రెండు దశల్లో  కరోనాకు గురైన వారు స్వీయ నిర్బంధంలో  ఉంటూ ఎదుర్కొన్న ఇబ్బందులు  మనకు తెలిసినవే.. అలాంటి పరిస్థితిలో ఎవరికైనా మనో ధైర్యం అవసరం ఉంటుంది.  ఈ క్రమంలో తన  ఆరోగ్య పరిస్థితిని వివరించింది.  తాను స్వీయ నిర్భందంలో ఉండలేకపోతున్నానిని తెలిపింది.  తనకు మద్దతుగా నిలిచి,  ఎంటర్ టైన్ చేయాలని కోరింది. అలాగే కరోనా బారిన పడకుండా ముందస్తు లక్షణాలు ఉన్న వారు త్వరగా కరోనా పరీక్షలు  చేయించుకోవాలని సూచింది.  కరోనా బారిన పడకుండా తమను తాము సూచించింది.

 

Scroll to load tweet…

 మరో వైపు ప్రభుత్వాలు కూడా  కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ ముగిసి థర్డ్ వేవ్ ప్రారంభమైన సందర్భంగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. ఇప్పటికే పలు సెంటర్లలో బూస్టర్ డోస్ లను అందిస్తుంది. అదేవిధంగా  ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు, మంజు లక్ష్మీ, మంజు మనోజ్ కూడా కరోనాతో గురై చికిత్స పొందుతున్నారు. ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా కరోనాకు గురైన విషయం తెలిసిందే.