ఎన్టీఆర్ తో అన్నారు..కానీ మహేష్ తో మీటింగ్ లు!
ప్రశాంత్ నీల్ హైదరాబాద్ లో సూపర్ స్టార్ మహేష్ బాబును కలవడం జరిగిందని తెలుస్తోంది. ప్రశాంత్ ఒక ఇంట్రెస్టింగ్ స్టొరీలైన్ తో మహేష్ ను ఒప్పించాడట. 'కె.జీ.ఎఫ్' తరహాలోనే ఈ కథకు కూడా ప్యాన్ ఇండియా అప్పీల్ ఉందని.. దీంతో మహేష్ ఎగ్జైట్ అయ్యాడని చెప్తున్నారు.
ఓ భాషలో ఓ సినిమా తీసి పెద్ద హిట్ కొడితే ఆ దర్శకుడుతో సినిమా చెయ్యాలని మిగతా భాషల్లో హీరోలు సైతం ఉవ్విళ్లూరుతారు. ఇప్పుడదే జరిగుతోంది. కన్నడ హీరో యష్ తో తెరకెక్కిన 'కె.జీ.ఎఫ్: చాప్టర్ 1' తో ఘన విజయం సాధించి సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. 'కె.జీ.ఎఫ్' పాన్ న్ ఇండియన్ ఫిలిం గా విజయం సాధించడంతో ఆయనపై అందరి దృష్టీ పడింది. ముఖ్యంగా మన తెలుగు హీరోలు ఆయనతో సినిమా చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపధ్యంలో మహేష్ బాబు సైతం ఆయనతో సినిమా చేయటానికి ఉత్సాహం చూపించారని సమాచారం.
ప్రశాంత్ నీల్ హైదరాబాద్ లో సూపర్ స్టార్ మహేష్ బాబును కలవడం జరిగిందని తెలుస్తోంది. ప్రశాంత్ ఒక ఇంట్రెస్టింగ్ స్టొరీలైన్ తో మహేష్ ను ఒప్పించాడట. 'కె.జీ.ఎఫ్' తరహాలోనే ఈ కథకు కూడా ప్యాన్ ఇండియా అప్పీల్ ఉందని.. దీంతో మహేష్ ఎగ్జైట్ అయ్యాడని చెప్తున్నారు. సినిమా గురించి ఇద్దరి మధ్య దాదాపు రెండుగంటలు పైగా చర్చలు సాగాయని సమాచారం. అన్ని అనుకున్నట్లు సవ్యంగా జరిగితే మహేష్ ఈ సినిమాను స్వయంగా నిర్మించేందుకు రెడీగా ఉన్నాడని టాక్. ఇక ఇప్పుడు కేజీఎఫ్ సెకండ్ పార్ట్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది.
అయితే కొన్ని రోజుల క్రితం మైత్రీ మూవీ మేకర్స్ వారు 'కె.జీ.ఎఫ్ 2' తర్వాత ప్రశాంత్ నీల్ తో తమ బ్యానర్ లోనే ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ - మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమాకు ప్రయత్నాలు సాగుతుంటే మైత్రీ - ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా ఏమైనట్టు.. అనే సందేహం మీడియా వర్గాల్లో మొదలైంది.