కన్నడ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 (Kgf Chapter 2) బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. సరికొత్త రికార్డులతో సౌత్ కా సుల్తాన్ అనిపిస్తున్నాడు యష్ (Yash). ఈ భారీ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ తో హిందిలో బిగెస్ట్ డేవన్ చిత్రంగా నిలిచింది.  

స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ చిత్రం KGF:చాప్టర్ 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. 2018లో ఈ చిత్రం మొదటి భాగం క్రియేట్ చేసిన డిమాండ్ కు వచ్చిన సీక్వెల్ ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందనను పొందుతోంది. ప్రారంభంతోనే ప్రభంజనం చూపెడుతోంది kgf2. ఈ చిత్రం గురువారం (నిన్న) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. దాదాపు 10000 స్క్రీన్‌లలో విడుదలైనట్లు సమాచారం. ఇండియాలో దాదాపు 6500 స్క్రీన్లలో ఈ చిత్రం అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక హిందీ వెర్షన్ మాత్రమే దాదాపు 4000 స్క్రీన్లలో ఆడుతోంది. మునుపెన్నడూ అసలు కన్నడ చిత్రానికి ఇంత పెద్ద ఎత్తున స్క్రీన్స్ పొందలేదు. దీంతో KGF2 కన్నడ చిత్ర పరిశ్రమకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందని చెప్పొచ్చు. అదే సమయంలో హిందీ మాట్లాడే బెల్ట్‌లో దక్షిణాది నుండి కమర్షియల్ చిత్రాలకు పెరుగుతున్న డిమాండ్‌ జోరుగా ఉంది. 

కేజీఎఫ్ చాప్టర్ 2 వరల్డ్ వైడ్ తొలిరోజు రూ. 134.5 కోట్లు రాబట్టింది. ఇది ఇప్పటికే కన్నడ సినిమా చరిత్రలో అతిపెద్ద వసూళ్లు రాబట్టిందని మేకర్స్ శుక్రవారం వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ RRRకు ఉన్న క్రేజ్ నే ప్రస్తుతం కేజీఎఫ్ 2 చూపెడుతోంది. అయితే తొలిరోజు ముఖ్యంగా హిందీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది కేజీఎఫ్ ఛాప్టర్ 2. తొలిరోజు హిందీలో రూ.53.95 కోట్లు వసూళ్లతో బిగ్గెస్ట్ కలెక్షన్ చేసిన చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ రికార్డును ‘వార్’ చిత్రం సొంతం చేసుకోగా.. తాజాగా యష్ దాన్ని బ్రేక్ చేశాడు. వార్ చిత్రం రూ. 53.35 కోట్లు, థగ్సాఫ్ హిందూస్థాన్ రూ. 52.25 కోట్లు, సంజు రూ.46.71 కోట్లు, బాహుబలి 2 రూ. 46.5 కోట్లు, టైగర్ జిందాహై రూ.45.53 కోట్లు, హ్యాపీ న్యూ ఈయర్ రూ. 44.97 కోట్లు, దంగల్ రూ. 42.41 కోట్లు సాంధించి రికార్డు క్రియేట్ చేశాయి. కానీ ఛాప్టర్ 2తో భారీ అంచనాలతో వచ్చిన కన్నడ చిత్రం వీటిని దాటేసింది.

Scroll to load tweet…

మరోవైపు KGF 2 దక్షిణ భారత రాష్ట్రాలలోనూ భారీ ఓపెనింగ్ పొందింది. ఈ చిత్రం కర్ణాటకలో బాక్సాఫీస్‌ను డామినేట్ చేయగా, తమిళనాడు, కేరళ మరియు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ లాంచ్ అందుకుంది. గతంలో కేరళలో భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా రికార్డును బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. తమిళనాడులో కూడా ఈ కేజీఎఫ్ 2కు డిమాండ్ పెరుగుతోంది. ఈ చిత్రంలో యష్ ప్రధాన పాత్ర పోషించగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దాదాపు నాలుగేండ్ల పాటు శ్రమించి రెండు పార్టులను పూర్తి చేశారు. హుంబాలే బ్యాన్స్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక సంజయ్ దత్, రవీనా టండన్, రావు రమేశ్, ప్రకాశ్ రాజు పలు కీలక పాత్రల్లో నటించారు.