'ఆర్.ఆర్.ఆర్' ప్లేస్ లోకి 'కేజీఎఫ్-2' ??
ఇప్పుడు కేజీఎఫ్ సీక్వెల్ మూవీ జులై 16న విడుదల కష్టమని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది. అంటే దసరాకు అంటున్నారు.
సినిమా అభిమానులంతా ఎదురుచూస్తున్న చిత్రాలు ఆర్ ఆర్ ఆర్,కేజీఎఫ్ 2. ఆర్ ఆర్ ఆర్ ని దసరా రిలీజ్ గా ప్లాన్ చేసారు. ఇక కేజీఎఫ్ ని జూలై 16న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. రాకీ భాయ్ వచ్చేస్తున్నాయ్ అంటూ ఫ్యాన్స్ అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో పరిస్దితులు మారిపోయాయి. పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ అటువి ఇటు,ఇటువి అటు అవుతున్నాయి. దాంతో ఇప్పుడు కేజీఎఫ్ సీక్వెల్ మూవీ జులై 16న విడుదల కష్టమని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది. అంటే దసరాకు అంటున్నారు.
అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో ఆ టైంలో.. అంటే దసరా పండుగ వేళలో కేజీఎఫ్-2 రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. అంటే ఆర్ ఆర్ ఆర్ బదులుగా అన్ని అనుకూలిస్తే కేజీఎఫ్ 2 థియోటర్స్ లో దిగుతుందన్నమాట.
కన్నడ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రమే కేజీఎఫ్ చాప్టర్ 2. 2018లో బాక్సాఫీస్ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్కు సీక్వెల్గా వస్తోందీ సినిమా. ఇందులో రాకీ భాయ్ను ఢీ కొట్టేందుకు అధీరాగా వస్తున్నాడు బాలీవుడ్ హీరో సంజయ్దత్. రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్ 2 విడుదల కానుంది.
ఇదిలాగ ఉంటే కేజీఎఫ్ 2 క్లైమాక్స్ గురించిన ఓ వార్త ఫ్యాన్స్ ని కంగారుపెడుతోంది. ఈ క్లైమాక్స్ లో హీరో యష్ చనిపోతాడట. సినిమా క్లైమాక్స్ లో అధిరాను చంపిన తర్వాత మొత్తం కేజీఎఫ్ కి రాజుగా మారిపోతాడు రాకీభాయ్. ఇక అధిరా చనిపోయాడన్న విషయం తెలుసుకున్న ప్రధాన మంత్రి ప్రత్యేక సైన్యంతో వచ్చి రాకీభాయ్ ను చంపేస్తారట. అంతేకాకుండా.. అతనికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తారని టాక్ వినిపిస్తోంది. తొలి భాగంలో తన తల్లి చెప్పినట్లుగానే రాకీ.. ధనవంతుడిగానే చనిపోతాడుని.. అలా కే.జీ.ఎఫ్ కథ అంతమవుతుందనే ప్రచారం జరుగుతోంది.