Asianet News TeluguAsianet News Telugu

సినీ కార్మికుల భూములపై అవినీతి.. ప్రముఖ నిర్మాత నిరసనకు పిలుపు!

ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తరచుగా నిరసనలు నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్యన బిగ్ బాస్ షో వివాదం నేపథ్యంలో కేతిరెడ్డి ఢిల్లీకి వెళ్లి మరీ నిరసన నిర్వహించారు. తాజాగా మరో ఉద్యమం చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. 

 

KethiReddy Jagadeeswar Reddy protest for film lands
Author
Hyderabad, First Published Aug 6, 2019, 7:39 PM IST

ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తరచుగా నిరసనలు నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్యన బిగ్ బాస్ షో వివాదం నేపథ్యంలో కేతిరెడ్డి ఢిల్లీకి వెళ్లి మరీ నిరసన నిర్వహించారు. తాజాగా మరో ఉద్యమం చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. 

1994లో అప్పటి ప్రభుత్వం తెలుగు సినీ కార్మికులకు హైదరాబాద్ లోని చిత్రపురి కాలనిలో భూములు కేటాయించింది. ఆ భూములకు ఓ కమిటీ కూడా ఉంది. కమిటీ సభ్యులు అవినీతికి పాల్పడి భూములని ప్రైవేట్ పరం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఈ వ్యవహారంపై ఆగష్టు 7న బుధవారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు బషీర్ భాగ్ లోని ప్రెస్ క్లబ్ లో నిరసన నిర్వహించబోతున్నట్లు కేతిరెడ్డి ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. 

KethiReddy Jagadeeswar Reddy protest for film lands

Follow Us:
Download App:
  • android
  • ios