మిస్ ఇండియా అంటే నేను కాదు ఒక బ్రాండ్..విదేశాల్లో కీర్తి చాయ్ బిజినెస్
జాతీయ అవార్డ్ విన్నర్ కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `మిస్ ఇండియా`, నారేంద్రనాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ శనివారం దసరా పండుగని పురస్కరించుకుని విడుదలైంది.
జాతీయ అవార్డ్ విన్నర్ కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `మిస్ ఇండియా`, నారేంద్రనాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ శనివారం దసరా పండుగని పురస్కరించుకుని విడుదలైంది.
ఇందులో ఓ వ్యక్తి చిన్నప్పటి కీర్తిని ఉద్దేశించి..`పెద్దయ్యాక నువ్వు ఏమవుతావ్` అంటే అందుకు `ఎంబీఏ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తా` అని కీర్తి సమాధానం చెబుతుంది. ఆ తర్వాత `నువ్వు నిజానికి చాలా దూరంగా.. అబద్దానికి చాలా దగ్గరగా బతుకుతున్నావు` ఓ వాళ్ళమ్మ అంటుంది. `బిజినెస్ అనేది మాటల్లోనుంచే కాదు.. మనసులోంచి కూడా పూర్తిగా తీసేశావు` అని కమల్ అంటాడు. కీర్తిని చేతుల్లోకి తీసుకుని రాజేంద్రప్రసాద్ `జీవితంలో ఎంత కష్టపడ్డామనేది ముఖ్యం కాదు.. ఎంత సంతోషంగా ఉన్నామనేది ముఖ్యం ` అని చెప్పడం..
`ఇండియన్ చాయ్` బిజినెస్ స్టార్ట్ చేస్తా అని కీర్తి అనడం.. ఆ తర్వాత నరేష్ ఉండి `మన ఛాయ్ని నేల కాని నేలమీద అమ్మడమంటే రియల్లీ గ్రేట్` అనడం, ఆ తర్వాత విలన్ అయిన జగపతిబాబు `బిజినెస్ అంటూ ఆడపిల్లలు ఆడుకునే ఆట కాదు.. బిజినెస్ ఒక యుద్ధం` అని చెప్పగా, `ఈ ప్రాసెస్లో మీదాక వస్తానో.. లేదా మిమ్మల్నీ దాటేస్తానో..` అని కీర్తి స్ట్రాంగ్ చెబుతుంది. చివరకు మిస్ ఇండియా అంటే నేను కాదు.. ఇదొక బ్రాండ్` అని తనదైన స్టయిల్లో చెప్పడం ఆకట్టుకుంది.
సినిమా ప్రధానంగా ఓ మహిళ డ్రీమ్, వాటిని నెరవేర్చుకోవడం, ఈ క్రమంలో ఎదురైన సవాళ్లని ఎదుర్కోవడం, అంతిమంగా ఉమెన్ ఎంపావర్మెంట్ని చాటడం నేపథ్యంలో సాగుతుందని అర్థమవుతుంది. కీర్తిసురేష్ ఇందులో స్లిమ్గా కనిపిస్తూ మరోసారి తన నట విశ్వరూపం చూపించబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాని ఈస్ట్ కోస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. త్వరలోనే థియేటర్లోకి తీసుకురాబోతున్నారు.