ఆ పాత్రలో నటించే ధైర్యం చేయలేను.. కీర్తి సురేష్!
'నేను శైలజ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ 'మహానటి' చిత్రంతో తన స్థాయిని మరింత పెంచుకుంది
'నేను శైలజ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ 'మహానటి' చిత్రంతో తన స్థాయిని మరింత పెంచుకుంది. అలనాటి కథానాయిక సావిత్రి పాత్రలో కీర్తి నటించిన తీరుకి ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగుతో పాటు కోలీవుడ్ లో కూడా టాప్ రేసులో దూసుకుపోతున్న కీర్తి మరో బయోపిక్ లో నటించనుందనే వార్తలువినిపించాయి.
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతుందని అన్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న జయలలిత బయోపిక్ కి కీర్తి న్యాయం చేస్తుందనే అభిప్రాయలు వెల్లడయ్యాయి. అయితే ఈ విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించగా.. ఆ ధైర్యం చేయలేనని చెబుతోంది. 'జయలలిత గారి బయోపిక్ నటించమని నన్ను ఇప్పటివరకు ఎవరూ సంప్రదించలేదు.
ఒకవేళ ఆఫర్ వచ్చినా నేను చేయలేనేమో.. ఎందుకంటే ఆమె పాత్రలో నటించేంత ధైర్యం నాకు లేదు' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కీర్తి నాలు తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది. అలానే తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రి పాత్ర పోషించనుంది.