యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భారీ బడ్జెట్ కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నాడు. అయితే ఈసారి బడ్జెట్ పరిమితుల్లో శ్రీనివాస్ మామిల్ల దర్శకత్వంలో 'కవచం' అనే సినిమాలో నటించాడు. 

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భారీ బడ్జెట్ కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నాడు. అయితే ఈసారి బడ్జెట్ పరిమితుల్లో శ్రీనివాస్ మామిల్ల దర్శకత్వంలో 'కవచం' అనే సినిమాలో నటించాడు.

కాజల్ హీరోయిన్ గా మెహ్రీన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బెల్లంకొండ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా.. సగానికి పైగా విడుదలకు ముందే రాబట్టింది. ప్రీరిలీజ్ బిజినెస్ రూ.15 కోట్లకు పైగా జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కాజల్, మెహ్రీన్ పాల్గొని సినిమాపై ఆసక్తి క్రియేట్ అయ్యేలా చేశారు. పైగా ప్రమోషన్స్ లో చోటా కె నాయుడు, కాజల్ ముద్దు వివాదం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. 

ఈ సినిమాపై బెల్లంకొండకి గట్టి నమ్మకమే ఉంది. కచ్చితంగా సక్సెస్ అందుకుంటానని భావిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోలు అమెరికాలో ప్రదర్శించకపోవడంతో సినిమా టాక్ బయటకి రాలేదు. ఇక్కడ మార్నింగ్ షో పడితే కానీ టాక్ బయటకి రాదు. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…