ఆమెపై పరువునష్టం దావా వేస్తా : కత్తి మహేష్
ఆమెపై పరువునష్టం దావా వేస్తా : కత్తి మహేష్
లైంగికంగా వేధించాడంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేసిన జూనియర్ ఆర్టిస్ట్ సునీతపై పరువునష్టం దావా వేస్తానని సినీ విమర్శకుడు కత్తి మహేష్ తెలియచేశాడు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన..తనపై ఆరోపణలు చేయాలని కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ కూడా సునీతను ప్రోత్సహించిందని అన్నారు.
సహాయంకోసం వెళ్ళిన తనను కత్తి మహేష్ లైంగికంగా వేధించాడని, గది తలుపులు మూసేశాడని సునీత టీవీ 9 చర్చా కార్యక్రమంలో ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను కత్తి మహేష్ తోసిపుచ్చాడు. కుట్రలో భాగంగానే ఆమె ఈ ఆరోపణలు చేసిందని పేర్కొన్నాడు.
I will be filing a defamation case against Sunitha for falsely accusing me of sexual harassment and Konidela Productions for instigating her.
— Kathi Mahesh (@kathimahesh) April 14, 2018