కార్తీ ‘సర్దార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడ? ఎప్పుడు? చీఫ్ గెస్ట్ ఎవరు?
తమిళ స్టార్, టాలెంటెడ్ హీరో కార్తీ తాజాగా నటించిన చిత్రం ‘సర్దార్’(Sardar). ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ నిర్వహిస్తున్నారు, చీఫ్ గెస్ట్ ఎవరనే దానిపై తాజాగా మేకర్స్ అప్డేట్ అందించారు.
రోటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటూ బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకుంటున్నాడు తమిళ స్టార్ హీరో కార్తీ (Karthi). ప్రస్తుతం తమిళంలో ‘సర్దార్’ అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ తెలుగులోనూ డబ్ వెర్షన్ లో విడుదల కాబోతోంది. మరో మూడు రోజుల్లో చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ‘సర్దార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈవెంట్ డిటేయిల్స్ ను అందించారు.
కార్తీ నటించిన ‘సర్దార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోనే నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఇందుకు ఏర్పాట్లను గ్రాండ్ గా చేయిస్తున్నారు. అక్టోబర్ 19న (రేపు) సాయంత్ర నాలుగు గంటలకు మాదాపూర్ లోని దసపల్లా కన్వెన్షన్ హాల్ నిర్వహించబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈవెంట్ కు కింగ్, అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. దీంతో కార్తీ, నాగార్జున అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ లో హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించారు. హీరోయిన్లుగా రజీషా విజయం, రాశీ ఖన్నా కనువిందు చేయనున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత లక్ష్మణ్ కుమార్ భారీ వ్యయంతో నిర్మించారు. తెలుగులో అన్నపూర్ణ స్టూడియో ద్వారా నాగార్జున రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కార్తీ డ్యూయల్ రోల్ చేస్తుండటం, సీనియర్ నటి లైలా కూడా కీలక పాత్ర పోషించడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.