కరాటే కళ్యాణి వివాదం ఇప్పట్లో సర్ధు మనిగేట్టు లేదు. ఒకటి పోతే మరొకటి.. ఏదో ఒక రకంగా వివాదాల్లో నిలుస్తోంది కళ్యాణి. తాజాగా మరోసారి.. షీటీమ్ కు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేసింది. కారణం ఏంటంటే..?
గత కొన్ని రోజులుగా.. కరాటే కళ్యాణి ఏదో ఒక రకంగా వివాదాల్లో నిలుస్తోంది. ఎదో ఒక రకంగా న్యూస్ ఐటమ్ అవుతూనే ఉంది. ఖమ్మంలో చేప్పట్టిన ఎన్టీఆర్ కృష్ణుడి విగ్రహంతో స్టార్ట్ అయిన రచ్చ.. ఇప్పటికీ ఆ వేవ్ అలాగే కొనసాగుతూనే ఉంది. కృష్ణుడిగా ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం ఏంటీ అని రచ్చ చేసిన కళ్యాణి... కోర్టు కు వెళ్ళి మరీ.. విగ్రహావిష్కరణ ఆపేయించింది. ఈక్రమంలో.. ఈ విషయంలో బహిరంగంగా వ్యాఖ్యలు, గొడవలు చేయడంతో పాటు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన నోటిస్ కూడా లెక్క చేయకపోవడంతో ఆమెను మా నుంచి కూడా తొలగించారు.
ఇక మా ను కూడా లెక్క చేయకుండా కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన కళ్యాణి. అప్పటి నుంచీ.. వరుసగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. డైలీ ఈ విషయాలలో ఏదో ఒక పాయింట్ బయటకు తీస్తూ.. రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తుంది కరాటే కళ్యాణి. ఇటీవల తనను చంపడానికి కూడా ప్లాన్ చేశారని రచ్చ రచ్చ చేసింది. ఇక ఇప్పుడు తన ఫోటోలు మార్పింగ్ చేస్తున్నారంటూ.. కొత్త పల్లవి అందుకుంది కళ్యాణి.
తాజాగా కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లో నిలిచింది. హైదరాబాద్ షీ టీంని కలిసి తన ఫోటోలను పలువురు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చింది కళ్యాణి. తన అసభ్యకరమైన ఫోటోలను వైరల్ చేస్తున్నారని. తన పాత సినిమాల్లోని ఫోటోలను మార్ఫింగ్ చేసి షేర్ చేస్తున్నారని, వైరల్ చేస్తున్నారని షీ టీమ్స్ కి ఫిర్యాదు చేసింది. ఇంకా వారు రెచ్చిపోకుండా ఉండాలంటే.. తగు చర్యలు తీసుకోవాలి అని కోరింది కళ్యాణి.
అంతే కాదు.. లలిత్ కుమార్, ఓంకార్, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్, దుర్గారావు, రాంబాబు, నితీష్, గుప్తా, నర్సింహా గౌడ్.. అనే పలువురు వ్యక్తులపై కేసు పెట్టింది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ..తన పరువుకు భంగం కలిగిస్తున్నారని, నా ఎదుగుదల తట్టుకోలేకే ఇలా చేస్తున్నారని, నాపై దుష్ప్రచారం చేస్తున్నారని కళ్యాణి తన ఫిర్యాదులో పేర్కొంది.
