‘‘భావోద్వేగం, విప్లవం, భారతీయ సంస్కృతి.. వీటి సమ్మేళమనమే ‘ఆర్ఆర్ఆర్’. అంత రెడీ అయ్యాక రిలీజ్ ఆగిపోవడానికి పెద్ద కారణం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ జనాలని భయపెట్టిన కరోనా మహమ్మారి.. థర్డ్ వేవ్ మళ్ళీ ఎంటర్ అయ్యింది..
ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ఇద్దరు హీరోలతో రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే డిల్లీలో థియోటర్స్ ని పూర్తి స్దాయిలో మూసేసారు. అక్కడ నుంచి రావాల్సిన రెవిన్యూ మొత్తం లాస్ అవుతుంది. ఈ విషయమై నిర్మాత, హిందీ డిస్ట్రిబ్యూటర్ నిరాశలో ఉన్నారు. దాంతో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు, పంపిణీదారుడు కరుణ్ జోహార్ ఈ విషయాన్ని పరిష్కరించటానికి తన వంతు ప్రయత్నం మొదలెట్టారు. అందులో భాగంగా ఓ ట్వీట్ చేసారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.
సినిమా ధియేటర్లను ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని, ధియేటర్లు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంచుతున్నారని, ఇతర బహిరంగ ప్రదేశాలతో పోలిస్తే థియేటర్లలో కోవిడ్ నిబంధనలు బాగా అమలవుతున్నాయని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు సీఎం కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ ‘సినిమాలు సేఫ్’ అనే హ్యాష్ టాగ్ ను వినియోగించారు.
ఇక ‘‘భావోద్వేగం, విప్లవం, భారతీయ సంస్కృతి.. వీటి సమ్మేళమనమే ‘ఆర్ఆర్ఆర్’. రామ్చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ కారణంగా ఈ ప్రాజెక్టు లార్జర్ దేన్ లైఫ్గా అవతరించింది. నా భార్య రమ (కాస్ట్యూమ్ డిజైనర్) మినహా ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు ఇతర రాష్ట్రాలకు చెందినవారు. పాన్ ఇండియా అంటే ఇదేనేమో’’ అని రాజమౌళి అన్నారు. ఈ చిత్రంలో రామ్చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమురం భీమ్గా కనిపించనున్నారు. ఆలియాభట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్. శ్రియ, అజయ్ దేవ్గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు. సుమారు రూ. 400 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా 2022 జనవరి 7న విడుదల కానుంది.
