ప్రభాస్ ని రిస్క్ లో పెట్టనున్నాడా..?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి 'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. అతడి తదుపరి సినిమాలను కూడా బాలీవుడ్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి 'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. అతడి తదుపరి సినిమాలను కూడా బాలీవుడ్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
బాహుబలి సినిమాను బాలీవుడ్ లో ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ విడుదల చేశారు. అప్పటినుండి కరణ్ జోహార్ కి బాహుబలి టీమ్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రభాస్ తదుపరి సినిమాలను కూడా కరణ్ జోహార్ విడుదల చేస్తాడని టాక్. ఇది ఇలా ఉండగా.. కరణ్ జోహార్ బాలీవుడ్ లో ప్రముఖ రియాలిటీ షో కాఫీ విత్ కరణ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ షో ఆరవ సీజన్ నడుస్తోంది. ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కనిపించారు. మొదటిసారి ఈ షోలో సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్, రాజమౌళి, రానా కనిపించబోతున్నారని సమాచారం. తన షోలో పాల్గొనమని కరణ్ ఈముగ్గురిని అడిగినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ గనుక ఈ షోకి అటెండ్ అయితే అతడిని అనుష్కతో ప్రేమ, అలానే పెళ్లి వంటి విషయాలకు సంబంధించి ప్రశ్నలను సంధించబోతున్నారని సమాచారం. అదే గనుక జరిగితే ప్రభాస్ ని ఈ ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం. ఈ నెలాఖరులోపు బాహుబలి టీమ్ ఈ షోలో ఎప్పుడు కనిపించనుందనే విషయంపై స్పష్టత రానుంది.