Asianet News TeluguAsianet News Telugu

Sai Dharam Tej: పవన్ తో కుదర్లేదు.. కనీసం మేనల్లుళ్లయినా ఒప్పుకుంటారా ?

సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టిన సంతోష్ శ్రీనివాస్.. కందిరీగ చిత్రంతో దర్శకుడిగా మారాడు. కందిరీగ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేదు.

Kandireega director trying to direct Sai dharam tej and Visshnav Tej
Author
Hyderabad, First Published Jul 1, 2022, 5:44 PM IST

సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టిన సంతోష్ శ్రీనివాస్.. కందిరీగ చిత్రంతో దర్శకుడిగా మారాడు. కందిరీగ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. దీనితో సంతోష్ శ్రీనివాస్ పై ఫ్లాప్ డైరెక్టర్ అనే ముద్ర పడిపోయింది. 

చివరగా సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన అల్లుడు అదుర్స్ చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది. గతంలో సంతోష్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తమిళ బ్లాక్ బస్టర్ తేరి చిత్రాన్ని రీమేక్ చేయాలని గట్టి ప్రయత్నాలే చేశాడు. పవన్ కూడా ఆ ప్రాజెక్ట్ పై సుముఖత వ్యక్తం చేశాడు. 

కానీ ఆ మూవీ పవన్ డేట్స్ కారణంగా అటకెక్కింది. ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ మెగా మేనల్లుళ్లు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లతో సినిమా చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడట. ఇద్దరిలో ఎవరు ఓకే చెప్పినా వారితో మూవీ చేసేందుకు సంతోష్ రెడీగా ఉన్నాడట. 

ఇద్దరి బాడీ లాంగ్వేజ్ కి సరిపడే స్టోరీ లైన్ సంతోష్ దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో ఎలాగైనా వీరిని ఒప్పించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని వినికిడి. యాక్సిడెంట్ తర్వాత తన కెరీర్ ఐ గాడిలో పెట్టుకునే ప్రయత్నాల్లో తేజు ఉన్నాడు. ఇక వైష్ణవ్ ఉప్పెనతో వచ్చిన క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ తరుణంలో సంతోష్ శ్రీనివాస్ కి ఓకే చెబితే కనుక అది మిరాకిల్ అనే చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో. 

 

Follow Us:
Download App:
  • android
  • ios