యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ నటించిన పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘విక్రమ్’. ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిశారు.   

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘విక్రమ్‌’. ‘కార్తీ’, ‘ఖైదీ’ చిత్రాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు లోకేష్‌ కనగరాజు ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమల్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth) ఆయన సొంతిటిలో మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరియు కమల్ హాసన్ రజినీకాంత్ ను కలిసి బొకే అందించారు. తమ చిత్రం రిలీజ్ గురించి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా రజినీ కాంత్ చిత్ర యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. సినిమా విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం ఫొటోలకు ఫోజులిచ్చారు. రజినీకాంత్, కమల్ హాసన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ ను షేర్ చేస్తున్నారు. 

ఐదు రోజుల్లో అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందీ చిత్రం. ఇప్పటికే ‘విక్రమ్’ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు వెర్షన్ ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రిలీజ్ చేయడం విశేషం. మరోవైపు ట్రైలర్ లో అదిరిపోయే యాక్షన్స్ సీన్స్.. దద్దరిల్లిపోయేలా ఉన్న డైలాగ్స్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఈగర్ ఎదురుచూస్తున్నారు. 

Scroll to load tweet…