Asianet News TeluguAsianet News Telugu

శ్రీవారిని దర్శించుకున్న చందమామ.. కొడుకుని ఎత్తుకుని తొలిసారి తిరుమలకు కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్ తన కొడుకుని ఎత్తుకుని తొలిసారి తిరుమలకు వచ్చింది. నేడు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకుంది.

Kajal Aggarwal Visits Tirumala temple with her son
Author
First Published Jan 30, 2023, 7:51 PM IST

అందాల చందమామ కాజల్ అగర్వాల్ తిరిగి సినిమాలతో బిజీ అవుతోంది. మాతృత్వం కోసం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న కాజల్ తిరిగి కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తోంది. 2020లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని కాజల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

వీరికి ఒక కొడుకు జన్మించాడు. తల్లిగా, భార్యగా కాజల్ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్ తన కొడుకుని ఎత్తుకుని తొలిసారి తిరుమలకు వచ్చింది. నేడు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకుంది. ప్రేమగా తన కొడుకుని ఎత్తుకున్న కాజల్ భక్తి శ్రద్దలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. 

టిటిడి అధికారులు దగ్గరుండి కాజల్ కి దర్శనం, ఇతర సౌకర్యాలు కల్పించారు. అర్చకులు కాజల్ కి, ఆమె కుమారుడికి ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. కాజల్ తన కుమారుడితో ఆలయం వద్ద వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇతర భక్తులు ఆమెని చూసేందుకు ఎగబడుతుండడంతో టిటిడి సిబ్బంది ఆమెకి భద్రత కల్పించారు. ఇక సినిమాల విషయానికి వస్తే కాజల్ ప్రస్తుతం కమల్ హాసన్, శంకర్ ఇండియన్ 2లో నటిస్తోంది. అలాగే నందమూరి బాలకృష్ణ 108వ చిత్రంలో కాజల్ కథానాయికగా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. 

గౌతమ్ కిచ్లు కాజల్ కి చిన్ననాటి నుంచి స్నేహితుడే. కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలపడంతో వీరిద్దరి వివాహం జరిగింది. కాజల్ తన కొడుకుకి నీల్ కిచ్లు అని నామకరణం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios