కొడాలి నానిపై కాలేసి కూర్చున్న జూనియర్ ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న ఫోటో
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటో్ చూసిన జనాలు తెగ కామెంట్లు చేస్తున్నా.. కౌంటర్ కామెంట్లు కూడా ఇస్తున్నారు. అసలు ముందు ఈ ఫోటో చూసి షాక్ అవుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నానీ.. వల్లభనేని వంశీ ఈ ముగ్గురు ఒకప్పుడు మంచి స్నేహితులు. ఎన్టీఆర్ తో ఈ ఇద్దరు నేతలు నిర్మాతలుగా సినిమాలు నిర్మించారు. ఆతరువాత ఆ ఎమ్మెల్యేలు తెలుగు దేశానికి దూరం అవ్వడంతో .. ఎన్టీఆర్ కు కూడా దూరంగా ఉంటున్నారు. కాని ఇప్పటికీ తారక్ తో వారి స్నేహం కొనసాగుతోంది అన్న రూమర్స్ కూడా ఉన్నాయి. అయితే అదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ట్విట్టర్లో పోస్ట్ అయిన ఈ ఫొటో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.
ఈ పోస్ట్ కు కామెంట్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి... లైకులు, రీ ట్వీట్లతో ట్విట్టర్ హోరెత్తిపోతుంది. ఇక ఈ ఫొటోపై కామెంట్లు, వాటిపై కౌంటర్ కామెంట్లు కూడా ఓ రేంజిలో సాగుతున్నాయి. పోస్ట్ పెట్టిన నిమిషాల్లోనే సోషల్ మీడియాలో తెగవైరల్ అయిపోయింది. ఈ ఫొటోను చూసిన నందమూరి ఫ్యాన్స్ తమ అభిమాన యంగ్ హీరో కెరీర్ బిగినింగ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇంతకీ ఆఫోటో ఎవరు ఉన్నారంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు కొడాలి నానీ, వల్లభనేని వంశీ ఉన్నారు. కొడాలిపై ఏకంగా ఎన్టీఆర్ కాలు వేసి మరీ కూర్చోడంతో ఈ ఫోటో ఇంకా వైరల్ అవుతుంది. ఈ ఫోటో ఎప్పుడో ఎన్టీఆర్ తో కొడాలి సినిమా చేస్తునప్పటిదిగా తెలుస్తోంది.
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, వైసీపీ కీలక నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం వైసీపీకి దగ్గరైన వల్లభనేని వంశీ కలిసి సరదాగా షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు తీసిన ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటో అందరికి ఆశ్చర్యంలోకి నెట్టేసింది. కొడాలి నాని మధ్యలో కూర్చుని ఉండగా... ఎడమ వైపున కూర్చున్న జూనియర్ ఎన్టీఆర్... తన కాలిని కొడాలి నాని కాలిపై వేసి మరీ కూర్చున్నారు. అదేమీ పట్టించుకోకుండా కొడాలి నాని ఏదో పనిలో బిజీగా ఉన్నట్టు ఉంది ఫోటోలో . అటు వంశీ ఈ సీన్ చూస్తూ.. నవ్వుతూ కనిపించారు.
కొడాలి నానీ నాని, వల్లభనేని వంశీ మోహన్ ఇద్దరూ టీడీపీతోనే పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశారు. టీడీపీలో ఉండగా... వీరితో జూనియర్ ఎన్టీఆర్ ప్రెండ్ షిప్ చేశారు.. తారక్ తో దాదాపు మూడు సినిమాలు కూడా నిర్మించారు వల్లభనేని వంశీ. కొడాలి నాని కూడా జూనియర్ ఎన్టీఆర్తో ఓ సినిమాను తెరకెక్కించారు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి దివంగత నందమూరి హరికృష్ణ అంటే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఎంతో అభిమానం. పార్టీలకతీతంగా హీరికృష్ణతో సన్నిహితంగా ఉండేవారు నానీ,వంశీ. ఇక ప్రస్తుతం ఈ స్టార్లు ముగ్గురు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.