సాయి ధరమ్ తేజ్ కు ఎన్టీఆర్ వాయిస్ సాయం..ఎలా ఉండబోతోందో
ఈ సినిమా టైటిల్, టీజర్ ను డిసెంబర్ 7 న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ టీజర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేస్తారనే టాక్ నడుస్తోంది. అలాగే ఈ టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒక స్టార్ సినిమాకు మరొక స్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వటం కొత్తేమీ కాదు. అయితే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో దిగి వచ్చి వాయిస్ ఇచ్చాడంటేనే ఆసక్తికరం. ఇప్పుడు అలాంటిదే జరగబోతోందని సమాచారం. సాయి ధరమ్ తేజ కొత్త చిత్రం టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారని సమాచారం. సాయిధరమ్ తేజ్ కు జూనియర్ ఓన్టీఆర్ మంచి మిత్రుడు కావటంతో ఇది సాధ్యమైందని వినికిడి. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే..
రోడ్డు ప్రమాదంలో గాయపడి కొన్నాళ్లు సినిమాకు దూరమైన మెగా మేనళ్లుడు , సాయిధరమ్ తేజ్ గాయం నుంచి కోలుకుని రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. యాక్సిడెంట్తో సినిమాలకు కొంత గ్యాప్ రావడంతో.. సాయి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్లో సాయి ధరమ్ తేజ్ మూవీ చేస్తున్నాడు.
ఈ మూవీ కు సుకుమార్ కథ అందిస్తుండగా కార్తీక వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో అజయ్, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ సినిమా ‘కాంతార’ కు సంగీతం అందించిన అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.
SDT 15 వర్కింగ్ టైటిల్గా తెరకెక్కుతున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్, క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు. శామ్దత్ షైనుద్దీన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ఆధ్యాత్మిక హారర్ థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. వరుస చావులకు కారణం తెలుసుకోవడానికి ఓ విలేజ్కి వెళ్లిన హీరో కథే ఈ సినిమా. 'సిద్ధార్థి నామ సంవత్సరే, బృహస్పతి సింహరసౌ స్థిత సమయే, అంతిమ పుష్కరే' అంటూ పోస్టర్ మీద రాసిన మాటలు ఆకట్టుకుంటున్నాయి. హిందూ కాలమానం ప్రకారం 53వ సంవత్సరంలో జరిగిన విషయాలను గుర్తు చేస్తున్నాయి.