Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ 'ఆంధ్రావాలా' సెన్సేషన్ కి అవాక్కైన అలియా భట్.. 10 లక్షల మంది అంటే మాటలా

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి చిత్రం తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. అప్పటికి నందమూరి వారసుడిగా విజయాలు దక్కించుకున్న ఎన్టీఆర్ సింహాద్రి చిత్రంతో టాలీవుడ్ లో కొత్త మాస్ గాడ్ గా మారిపోయాడు.

Jr NTR reveals audio launch of Andhrawala details at Kapil sharma show
Author
Hyderabad, First Published Jan 3, 2022, 3:16 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి చిత్రం తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. అప్పటికి నందమూరి వారసుడిగా విజయాలు దక్కించుకున్న ఎన్టీఆర్ సింహాద్రి చిత్రంతో టాలీవుడ్ లో కొత్త మాస్ గాడ్ గా మారిపోయాడు. సింహాద్రి విజయంతో ఎన్టీఆర్ స్టార్ డం పీక్స్ కు చేరింది. 

సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆంధ్రావాలా చిత్రంలో నటించాడు. ఆ చిత్రంపై కనీవినీ ఎరుగని రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఆ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమం అయితే టాలీవుడ్ చరిత్రలోనే నభూతో న భవిష్యతి అన్నట్లుగా జరిగింది. 

ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్ ఆంధ్రావాలా చిత్రం గురించి కపిల్ శర్మ షోలో ప్రస్తావించాడు. నిమ్మకూరులో జరిగిన ఆంధ్రావాలా ఆడియో లాంచ్ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది అభిమానులు హాజరయ్యారని ఎన్టీఆర్ తెలిపారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు, రైళ్లు నడిపినట్లు ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని విన్న అలియా భట్ అవాక్కైంది. ఎన్టీఆర్ క్రేజ్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయింది. 

ఆడియో లాంచ్ కార్యక్రమానికి ఎన్టీఆర్ హెలికాఫ్టర్ లో హాజరయ్యాడు. ఆడియో లాంచ్ యాంకర్ లేకుండానే జరిగింది. యాంకరింగ్ చేయాల్సిన వాళ్లు నిమ్మకూరు రోడ్లన్నీ జనసంద్రంగా, ట్రాఫిక్ తో నిండిపోవడంతో హాజరు కాలేకపోయారు. అప్పట్లో ఆంధ్రావాలా ఆడియో లాంచ్ ఒక సెన్సేషన్. కానీ సినిమా మాత్రం నిరాశపరిచింది. 

ఇదిలా ఉండగా ఎన్టీఆర్, చరణ్, అలియా, రాజమౌళి దేశం మొత్తం తిరిగి ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా జనవరి 7న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. 

Also Read: వావ్.. మెస్మరైజింగ్ థైస్ అందాలతో నిధి.. వైరల్ అవుతున్న హాట్ ఫోజులు

Follow Us:
Download App:
  • android
  • ios